Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి కలిసిరాని గోదావరి

By:  Tupaki Desk   |   20 Feb 2019 1:30 AM GMT
చంద్రబాబుకి కలిసిరాని గోదావరి
X
నదుల అనుసంధానం చాలా కష్టమైనది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చితే కానీ పూర్తవ్వదు. అలాంటి నదులు అనుసంధానాన్ని చాలా తేలిగ్గా పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరిచ్చారు చంద్రబాబు. గోదావరి నీళ్లని ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో కలిపారు. దీనిద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు లభించింది.

ఇంతవరకు బాగానే ఉంది ఇలా నదులు అనుసంధానం చేయడం ప్రకృతికి మరీ ముఖ్యంగా గోదావరి తల్లికి ఇష్టం లేనట్లుంది. అందుకే గోదావరి అనే పదం చంద్రబాబుకు అస్సలు కలిసిరావడం లేదు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 23 మంది చనిపోయారు. చంద్రబాబుపై ప్రోమో షాట్స్‌ కోసం జనాన్ని అంతసేపు ఉంచి ఒక్కసారిగా వదిలారని.. అందుకే తొక్కిసలాట జరిగిందిని వైసీపీ ఆరోపించింది. ఇది అప్పట్లో చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర పడవమునక. ఈ ప్రమాదంలో బోటు తిరగబడిపోవడంతో అమాయక ప్రజలు చనిపోయారు. ఇక్కడే గోదావరి నీళ్లు కృష్ణానదిలో కలుస్తాయి. ఇప్పుడేమో గోదావరి జిల్లాల నాయకులు. ఎక్కడైతే.. చంద్రబాబు గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెల్చుకున్నాడో.. అదే గోదావరి జిల్లాల్లోని టీడీపీ నాయకులంతా ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. చూస్తుంటే చంద్రబాబుకి గోదావరి తల్లి శాపం ఏదో ఉన్నట్లుంది.