Begin typing your search above and press return to search.

వాస్తు కోసం టీఆర్ ఎస్ ఆఫీసులో ఏం చేశారంటే..

By:  Tupaki Desk   |   27 May 2017 11:42 AM GMT
వాస్తు కోసం టీఆర్ ఎస్ ఆఫీసులో ఏం చేశారంటే..
X
అధికారం సాధించడం ఒక ఎత్తయితే.. దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఈ విషయంలో తలపండిన రాజకీయ నేతలకు కూడా లోలోన కంగారు ఉంటుంది. పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ.. అధికారం చేజారిపోనివ్వకుండా జాగ్రత్త పడుతుంటారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. చిన్న చిన్న భయాల్ని కూడా పట్టించుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఆయనకు గ్రహాలు.. వాస్తుకు సంబంధించిన భయాలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన చాలా పెద్ద స్థాయిలో యాగాలు అవీ జరిపించారు. తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇప్పుడు ఆయన వాస్తు భయాలతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాయలంలో కీలక మార్పులు చేయించారు. వాస్తు పండితుల సూచన ప్రకారం ఆయన 25 దేశాల నుంచి వివిధ రకాల ఖరీదైన మొక్కలు తెప్పించి నాటించడం విశేషం. మనీ ప్లాంట్స్ లాగే లక్కీ ప్లాంట్స్ గా గుర్తింపు ఉన్న ఫికస్ మొక్కల్ని టీఆర్ ఎస్ నేతలు తైవాన్ తేశం నుంచి తెప్పించారు. అలాగే ఇటలీ నుంచి ఆలివ్ మొక్కలూ వచ్చాయి. ఇంకా మెక్సికో.. ఆస్ట్రేలియా.. అమెరికా తదితర దేశాల నుంచి పలు రకాల మొక్కులు తెచ్చి టీఆర్ ఎస్ ఆఫీస్ గార్డెన్లో నాటించారు. ఇవి ఈ కార్యాలయానికి ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీదే విజయం అంటున్నారు. అయినప్పటికీ అధికారం నిలబెట్టుకునేందుకు వాస్తు పండితుల సూచనల మేరకు ఇలాంటి మార్పలు చేయించారు టీఆర్ఎస్ నాయకులు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/