Begin typing your search above and press return to search.
టోల్ ప్లాజా దగ్గర ఎమ్మెల్యే వీరంగం..వైరల్!
By: Tupaki Desk | 18 July 2018 4:31 PM GMTకేరళలోని పూంజార్ నియోజకవర్గ ఎమ్మెల్యే పీసీ జార్జ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలు - చేష్టలతో వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. గత ఏడాది...ఆర్డర్ ఇచ్చిన వెంటనే భోజనం తీసుకురాలేదనే కారణంతో క్యాంటీన్ సిబ్బందిపై జార్జ్ చేయి చేసుకోవడం సంచలనం రేపింది. ఆ తర్వాత ఓ ల్యాండ్ విషయంలో వ్యాపారులతో జరిగిన గొడవలో....సదరు ఎమ్మెల్యే గారు..తుపాకీ తీసి వీరంగం సృష్టించారు. వీటితోపాటు జార్జ్ అనేక సార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశమయ్యారు. తాజాగా, మరోసారి జార్జ్ తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. తన వాహనాన్ని అనుమతించడంలో జాప్యం కావడంతో....ఓ టోల్ ప్లాజా వద్ద జార్జీ వీరంగం వేశారు. ఆగ్రహంతో ఊగిపోతూ స్టాప్ బారియర్ ను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మంగళవారం అర్ధరాత్రినాడు కొచ్చి నుంచి త్రిశూర్ కు వెళుతున్న జార్జ్.....పాలియెక్కర టోల్ ప్లాజా వద్ద తన వాహనాన్ని ఆపారు. అయితే, ఆ వాహనంపై ఎమ్మెల్యే అని స్టిక్కర్ ఉన్నప్పటికీ.....టోల్ సిబ్బంది వారిని అనుమతించలేదు. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన జార్జ్....తన అనుచరులతో పాటు కారు దిగి వచ్చి అక్కడి స్టాప్ బారియర్ ను విరగ్గొట్టారు. ఎమ్మెల్యే బోర్డు ఉన్నప్పటికీ తనను 3 నిమిషాల పాటు వెయిట్ చేయించారని, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తనకు కోపం వచ్చి అలా చేశానని తన చర్యను సమర్థించుకున్నారు. తాను ఎమ్మెల్యే అని, తాను రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, తాను త్వరగా వెళ్లాలని...అవసరమైతే టోల్ ఫీజు కూడా కడతానని చెప్పినా వారు వినలేదని చెప్పారు. ఆ టోల్ ప్లాజా సిబ్బందిపై కేరళ సీఎంకు - సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరోవైపు - ఆ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ను తాము గమనించలేదని - అందుకే వాహనాన్ని అనుమతించడంలో జాప్యం జరిగిందని సిబ్బంది వివరణ ఇచ్చారు. జార్జ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు చెప్పారు.
మంగళవారం అర్ధరాత్రినాడు కొచ్చి నుంచి త్రిశూర్ కు వెళుతున్న జార్జ్.....పాలియెక్కర టోల్ ప్లాజా వద్ద తన వాహనాన్ని ఆపారు. అయితే, ఆ వాహనంపై ఎమ్మెల్యే అని స్టిక్కర్ ఉన్నప్పటికీ.....టోల్ సిబ్బంది వారిని అనుమతించలేదు. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన జార్జ్....తన అనుచరులతో పాటు కారు దిగి వచ్చి అక్కడి స్టాప్ బారియర్ ను విరగ్గొట్టారు. ఎమ్మెల్యే బోర్డు ఉన్నప్పటికీ తనను 3 నిమిషాల పాటు వెయిట్ చేయించారని, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తనకు కోపం వచ్చి అలా చేశానని తన చర్యను సమర్థించుకున్నారు. తాను ఎమ్మెల్యే అని, తాను రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, తాను త్వరగా వెళ్లాలని...అవసరమైతే టోల్ ఫీజు కూడా కడతానని చెప్పినా వారు వినలేదని చెప్పారు. ఆ టోల్ ప్లాజా సిబ్బందిపై కేరళ సీఎంకు - సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరోవైపు - ఆ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ను తాము గమనించలేదని - అందుకే వాహనాన్ని అనుమతించడంలో జాప్యం జరిగిందని సిబ్బంది వివరణ ఇచ్చారు. జార్జ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు చెప్పారు.