Begin typing your search above and press return to search.

పూల వ్యాపారికి భారీ ప‌న్ను!

By:  Tupaki Desk   |   27 Jun 2017 10:27 AM GMT
పూల వ్యాపారికి భారీ ప‌న్ను!
X
అత‌డో పూల వ్యాపారి. ఆయ‌నకు అక్ష‌రాలా రూ. 36 ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌న్ను విధించారు ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు. పూల వ్యాపారికి అంత భారీ మొత్తంలో ప‌న్ను విధించ‌డం ఏమిటి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఆ ప‌న్ను పూల వ్యాపారంపై విధించిన‌ది కాదులేండి.

చిత్తూరుకు చెందిన పూల వ్యాపారి రఘరామ్‌ ఆదాయపు పన్ను శాఖకు రూ.36 లక్షల పన్నును చెల్లించారు. ఆయ‌న‌ కాణిపాకంలో రూ.2 కోట్లతో రఘురామ్‌ కల్యాణ మండపం నిర్మించారు. ఆ మండ‌పానికి సంబంధించిన లెక్క‌ల‌ను ర‌ఘురామ్ చూప‌లేదు.

మండపానికి సంబంధించిన లెక్కలు చూపనందుకు ఐటీ అధికారులు ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ర‌ఘురామ్‌ పూర్తిస్థాయిలో రూ. 36 ల‌క్ష‌ల ప‌న్నును చెల్లించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/