Begin typing your search above and press return to search.

బీజేపీ రేసుగుర్రాల ఫ‌స్ట్ లిస్ట్ బ‌య‌ట‌కొచ్చింది

By:  Tupaki Desk   |   21 Oct 2018 5:19 AM GMT
బీజేపీ రేసుగుర్రాల ఫ‌స్ట్ లిస్ట్ బ‌య‌ట‌కొచ్చింది
X
తెలంగాణ రాష్ట్ర ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీ త‌న తొలి జాబితాను ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తూ.. కేసీఆర్ నిర్ణ‌యం తీసుకొని.. ఆ వెంట‌నే త‌మ పార్టీ అభ్య‌ర్థులుగా 105 మందిని ప్ర‌క‌టించిన కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టించారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన దాదాపు 45 రోజుల త‌ర్వాత బీజేపీ త‌న తొలి జాబితాను రిలీజ్ చేసింది.

ఇందులో మొత్తం 38 స్థానాల‌కు పోటీ చేసే అభ్య‌ర్థులు ఉన్నారు. తొలి జాబితాలో ఐదుగురు సిట్టింగుల‌కు వారి.. వారి స్థానాల్ని కేటాయించింది. తాజా మాజీల‌తో పాటు ప‌లువురు కొత్త వారికి చోటు క‌ల్పిస్తూ బీజేపీ త‌న అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది.

టీఆర్ ఎస్ నుంచి ఎదురైన అవ‌మాన‌క‌ర ప‌రిస్థితితో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీ తీర్థం తీసుకున్న సినీ న‌టుడు క‌మ్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహ‌న్ కు సీటు ల‌భించింది. వివిధ సామాజిక వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్యం ల‌భించేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టంతో పాటు.. ముగ్గురు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ తొలి జాబితాను సిద్ధం చేశారు.

మొత్తం 38 మంది అభ్య‌ర్థుల్లో ఎస్సీలు ఆరుగురు.. ఎస్టీలు ముగ్గురు.. బీసీలు తొమ్మిది మంది ఉన్నారు. పోటీ ఎక్కువ‌గా లేనివి.. వివాదాస్ప‌దం కానివి.. రిజ‌ర్వ్ స్థానాల‌ను త‌న మొద‌టి జాబితాలో చేర్చిన బీజేపీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ తొలి విడతగా 38 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ చార్జి - కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తాజా మాజీ ఎమ్మెల్యేలందరితోపాటు పలువురు కొత్త వారికి చోటు లభించింది. ముగ్గురు మహిళలకూ అవకాశం కల్పించారు. ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న బాబూమోహన్‌ వంటి వారికీ సీటు దక్కింది. మొత్తంగా వివిధ సామాజికవర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ సమతుల్యత పాటించారు.

38 మందిలో ఆరుగురు ఎస్సీలు - ముగ్గురు ఎస్టీలు - 9 మంది బీసీలకు అవకాశం కల్పించారు. పోటీ ఎక్కువలేనివి - వివాదాస్పదం కానివాటిని - రిజర్వ్‌ డ్‌ నియోజకవర్గాలను మొదటి జాబితాలో చేర్చినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. జాబితా విడుదలకు ముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా - ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించారు. మధ్యాహ్నం తెలంగాణ నేతలు అమిత్‌ షా నివాసంలో భేటీ అయి చర్చలు జరిపారు. కాగా కోరుట్లకు చెందిన పీసీసీ కార్యదర్శి డాక్టర్‌ వెంకట్‌ శనివారమే పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో బీజేపీలో చేరగా.. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మరోవైపు తెలంగాణతోపాటే ఎన్నికలు జరగనున్న 90 స్థానాలు గల ఛత్తీస్‌ గఢ్‌ కు తొలి విడతగా 77 మందిని - 50 స్థానాలు కలిగిన మిజోరంనకు 13 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

+ ముషీరాబాద్ కె.లక్ష్మణ్‌

+ అంబర్‌పేట జి.కిషన్‌ రెడ్డి

+ ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి

+ ఉప్పల్ ఎన్‌ వీఎస్‌ ఎస్‌ ప్రభాకర్‌

+ గోషామహల్ టి.రాజాసింగ్‌

+ మల్కాజిగిరి ఎన్‌.రాంచందర్‌ రావు

+ ఎల్‌బీ నగర్ పేరాల శేఖర్‌ రావు

+ పెద్దపల్లి జి.రామకృష్ణారెడ్డి

+ సూర్యాపేట సంకినేని వెంకటేశ్వరరావు

+ మేడ్చల్ పి.మోహన్‌ రెడ్డి

+ కల్వకుర్తి టి.ఆచారి

+ మునుగోడు జి.మనోహర్‌రెడ్డి

+ పాలేరు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి

+ కరీంనగర్ బండి సంజయ్‌

+ దుబ్బాక ఎం.రఘునందన్‌రావు

+ ఆందోల్ బాబూమోహన్‌

+ భద్రాచలం కుంజా సత్యావతి

+ ఆదిలాబాద్ పాయల శంకర్‌

+ ముథోల్ పడకంటి రమాదేవి

+ నారాయణపేట ఆర్‌.పాండురెడ్డి

+ మక్తల్ బి.కొండయ్య‌

+ షాద్‌నగర్ ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి

+ పరకాల పి.విజయచంద్రారెడ్డి

+ భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి

+ బోథ్ మాధవి రాజు

+ బెల్లంపల్లి కొయ్యల ఎమాజి

+ కామారెడ్డి కె.వెంకటరమణారెడ్డి

+ పినపాక- సంతోష్‌ కుమార్‌ చందా

+ ఆర్మూర్ ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి

+ ధర్మపురి కన్నం అంజయ్య

+ మానకొండూరు గడ్డం నాగరాజు

+ తాండూరు పటేల్‌ రవిశంకర్‌

+ కార్వాన్ టి.అమర్‌ సింగ్‌

+ గద్వాల గద్వాల్‌ వెంకటాద్రిరెడ్డి

+ అచ్చంపేట మల్లేశ్వర్‌ మేడిపూర్‌

+ సత్తుపల్లి నంబూరి రామలింగేశ్వర్‌ రావు

+ కోరుట్ల జె.వెంకట్‌.

+ నిజామాబాద్‌ రూరల్ కేశపల్లి ఆనంద్‌ రెడ్డి