Begin typing your search above and press return to search.

క‌డ‌ప జిల్లాలో న‌డిరోడ్డు మీద న‌రికేశారు

By:  Tupaki Desk   |   25 May 2017 7:22 AM GMT
క‌డ‌ప జిల్లాలో న‌డిరోడ్డు మీద న‌రికేశారు
X
వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో ఒక వ్య‌క్తిని అత్యంత దారుణంగా న‌రికి చంపారు. ప‌ట్ట‌ప‌గ‌లు.. న‌డి రోడ్డు మీద అంద‌రూ చూస్తుండ‌గా.. ఒక వ్య‌క్తిని న‌లుగురు వేటాడి వెంటాడి మ‌రీ న‌రికేసిన వైనం సంచ‌ల‌నంగా మారింది. గ‌డిచిన కొన్నాళ్లుగా ఫ్యాక్ష‌న్ కు దూరంగా ఉన్న జిల్లా వాసులు తాజా హ‌త్యోదంతంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఈ హ‌త్యకు సంబంధించిన ఘోరాన్ని ఒక వ్య‌క్తి వీడియో తీసి.. మీడియా సంస్థ‌ల‌కు పంప‌టంతో ఈ దారుణం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా వెలుగులోకి వ‌చ్చింది.

పాత కేసుల నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లా పొద్దుటూరు కోర్టుకు హాజ‌ర‌య్యేందుకు మారుతి ప్ర‌సాద్ రెడ్డి వెళుతున్నారు. అత‌డ్ని హ‌త‌మార్చేందుకు ప్లాన్ వేసిన ప్ర‌త్య‌ర్థులు.. అత‌డ్ని వెంటాడారు. ప్రాణ‌భ‌యంతో ప‌రిగెడుతున్న అత‌డ్ని న‌లుగురు ప‌ట్టుకొని చంపారు. మృతుడు జ‌మ్మ‌ల‌మ‌డుగు మండ‌లం దేవ‌గుడి వాసిగా భావిస్తున్నారు.

కోర్టు స‌మీపంలో జ‌రిగిన ఈ హ‌త్య స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. న‌డిరోడ్డు మీద అంద‌రూ చూస్తుండ‌గా హ‌త్య చేస్తున్నా.. ఎవ‌రూ ఆ కిరాత‌కాన్ని నిలువ‌రించ‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. హ‌త్య‌ను చూస్తున్న వారిలో కొంద‌రు వీడియో తీసుకోగా.. మ‌రికొంద‌రు త‌మ మానాన తాము వెళ్ల‌టం క‌నిపిస్తుంది. ఒక‌రిద్ద‌రు మాత్రం అయ్యో అన‌టం క‌నిపిస్తుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఈ హ‌త్య ఎందుకు జ‌రిగింద‌న్న వివ‌రాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/