Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురిపై టీడీపీ వేటేసింది

By:  Tupaki Desk   |   11 Feb 2016 4:10 AM GMT
ఆ ముగ్గురిపై టీడీపీ వేటేసింది
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆల‌స్యంగా మేలుకుంది. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన పార్టీలో క‌ట్టుబాట్ల‌ను దిక్కరించిన‌ విష‌యాన్ని లైట్ తీసుకున్న స‌మ‌యంలో గ‌ట్టి షాక్ త‌గిలడంతో అనంత‌రం మేలుకొని వేగంగా స్పందించింది. తెలంగాణ అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్ పార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ లో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ కారెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రుస‌టి రోజు ఇద్ద‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యేలైన‌ పార్టీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ టీడీపీకి గుడ్‌ బై చెప్పారు.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గులాబీ కండువా చెప్పిన నేప‌థ్యంలో వెంట‌నే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన టీడీపీ ఆ విష‌యంలో నాన్చిన‌ప్ప‌టికీ తాజాగా ద‌యాక‌ర్‌ రావు - ప్ర‌కాశ్‌ గౌడ్ టాటా చెప్పడంతో ఖంగుతింది. ఈ నేప‌థ్యంలో ఈ ముగ్గురు నేతలను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ముగ్గురు నేత‌లు ఇప్పటికే వీరు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ ఎస్‌ లో చేరిన విషయం తెలిసిందే.