Begin typing your search above and press return to search.

మహిళా ఓటర్లకు ఈసీ సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   25 April 2019 6:41 AM GMT
మహిళా ఓటర్లకు ఈసీ సర్ ప్రైజ్
X
ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా ఓటేసే మహిళలకు ఓ గిఫ్ట్ ను ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘సఖి మత్ దాన్ కేంద్రాస్’ అనే పథకం కింద ముంబై నగర పరిధిలోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 29న ఓటు వేసే మహిళలందరికీ సానిటరీ న్యాప్ కిన్లు అందజేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నికల్లో మహిళా ఓటర్లను మరింత పెంచడానికి.. మురికివాడల్లోని మహిళలను ఆదుకునేందుకు .. ప్రజాస్వామ్యంలో మహిళలను భాగస్వాములను చేయడానికే ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ఈసీ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ముంబై నగరంలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ న్యాప్ కిన్ల పంపిణీ చేస్తామని.. దీంతోపాటు కుర్లా - అంధేరి బోరివిల్లి లాంటి సబ్ డివిజన్లలో కూడా న్యాప్ కిన్లు పంపిణీచేస్తామని అధికారులు తెలిపారు.

ఈ పోటింగ్ కేంద్రాల్లో మొత్తం మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని.. వాళ్లే ఓటేసిన ప్రతి మహిళకు సానిటరీ న్యాప్ కిన్ ప్యాకెట్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.