Begin typing your search above and press return to search.

తాగిన లవ్వర్స్ రచ్చతో పోలీసులకు షాక్

By:  Tupaki Desk   |   24 Aug 2016 6:23 AM GMT
తాగిన లవ్వర్స్ రచ్చతో పోలీసులకు షాక్
X
ఇద్దరి ప్రేమికులు రచ్చ తమిళనాడులోని వేలూరులో తీవ్ర సంచలనంగా మారటమే కాదు.. అక్కడి పోలీసులకు పెద్ద సినిమానే చూపించింది. పూటుగా తాగేసిన ఒక ప్రేమజంట రోడ్డుమీద చేసిన రచ్చ రచ్చ చేయటమే కాదు.. వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులకు సైతం చుక్కలు చూపించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులోని తుత్తిపట్టు కామరాజనగర్ కు చెందిన వివేకానంద్.. బెంగళూరుకు చెందిన అర్చనలు ఇద్దరూ లవ్వర్స్ గా చెబుతున్నారు. వీరిద్దరి పరిచయం ఎక్కడ జరిగిందన్న విషయంపై పూర్తి సమాచారం లేనప్పటికీ.. వారిద్దరూ ఫుల్ గా తాగేసి మధ్యాహ్న వేళలో వేలూరు పట్టణంలోని అన్నాసాలైలో టూవీలర్ మీద అడ్డదిడ్డంగా డ్రైవ్ చేశారు.

వివేకానంద్ డ్రైవింగ్ కు షాక్ తిన్న వాహనదారుల్లో ఒకరు.. ఎందుకలా రాష్ గా డ్రైవ్ చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. అంతే.. బండి వెనుక కూర్చున్న అర్చన బండి దిగి.. ఆ యువకుడి చొక్కా పట్టుకొని చింపేయటమే కాదు.. అతడిపై దాడికి పాల్పడింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ గొడవ జరుగుతున్న చోటకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఫుల్ గా తాగిన ప్రేమజంట రచ్చను గుర్తించిన ఎస్ ఐ వారిని సమీపంలోని నార్త్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత కూడా మద్యం మత్తులో ఉన్న అర్చన పోలీసులపై చెలరేగిపోయిందని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్టేషన్లో అందరూ చూస్తుండగా.. తన ప్రియుడ్ని గట్టిగా కౌగిలించుకొని.. ముద్దులు పెట్టుకోవటంతో పోలీసులు బిత్తరపోయారు. ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకున్నారు. వారిని బలవంతంగా విడదీసి వేర్వేరుగా కూర్చోబెట్టారు. ఈ సమయంలోనూ సదరు యువతి పోలీసుల మీదా దాడి చేయటం గమనార్హం. వారి వివరాల్ని సేకరించిన పోలీసులు.. వారిని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు నానా పాట్లు పడ్డారు. అనంతరం తాగి డ్రైవ్ చేసిన వివేకానంద్ కు ఫైన్ వేసి పంపించేయగా.. పోలీసుల మీద దాడి చేసిన అర్చనను మాత్రం జడ్జి నివాసానికి తీసుకెళ్లి.. ఆయన సూచనల మేరకు వేలూరు మహిళా కారాగారినకి తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.