Begin typing your search above and press return to search.

దావూద్ ని మోడీ మీట్ అయ్యారంటున్న అజం

By:  Tupaki Desk   |   6 Feb 2016 2:14 PM GMT
దావూద్ ని మోడీ మీట్ అయ్యారంటున్న అజం
X
నోటికి వచ్చినట్లుగా మాట్లాడే కొందరునేతల్లో సమాజ్ వాదీ నేత.. ఉత్తరప్రదేశ్ కు చెందిన అజంఖాన్ ఒకరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించే అతనికి యూపీలో ఎదురులేదని చెబుతారు. తాజాగా అతగాడు ప్రధాని నరేంద్రమోడీ మీద సంచలన ఆరోపణలు చేశారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆప్ఘనిస్తాన్ నుంచి నేరుగా పాక్ వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రధాని.. ఆ సందర్భంగా నవాజ్ ఇంట జరుగుతున్న అతని మనమరాలి పెళ్లికి వెళ్లటం తెలిసిందే.

తాజాగా అజాం ఖాన్ మాట్లాడుతూ.. పాక్ వెళ్లిన మోడీ.. అక్కడ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను కలిశారంటూ ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆరోపణలు మాట పక్కన పెడితే.. తాను చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయంటూ అజంఖాన్ చెప్పటం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. మాటలు చెప్పే కన్నా.. తన ఆరోపణలకు తగిన ఆధారాల్ని అజంఖాన్ చూపిస్తే బాగుంటుందేమో.

ఇక్కడే ప్రస్తావించాల్సిన మరో విషయం ఏమిటంటే.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనమరాలి పెళ్లికి మాఫియా డాన్ హాజరయ్యారన్నది చద్ది న్యూస్. కాకుంటే.. మోడీ వెళ్లిన రోజు కాకుండా ఆ తర్వాత వేడుకకు ఆయన హాజరయ్యారన్న విషయం గతంలోనే బయటకు వచ్చింది. మరి.. అజం ఖాన్ కు ఈ విషయం ఇప్పుడే తెలిసిందో.. ఏమోకానీ.. దావూద్.. మోడీని కలిపేసి ఆరోపణలు చేసేశారు.