Begin typing your search above and press return to search.

టీడీపీలో డీఎల్ రారట.. పుట్టా స్పష్టం

By:  Tupaki Desk   |   21 Feb 2019 10:43 AM GMT
టీడీపీలో డీఎల్ రారట.. పుట్టా స్పష్టం
X
టీడీపీలో టికెట్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వస్తున్న వలస నేతలతో సొంత పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తమకు టికెట్ రాదేమోనని అధినేత వద్దకు పరుగులు పెడుతున్నారు. టికెట్ రాకపోతే టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామంటున్నారు. తాజాగా కడప జిల్లాలోని మైదకూరు టికెట్ పై పోరు మొదలైంది..

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి వస్తారని.. ఆయనకు మైదకూరు టికెట్ ను బాబు ఇస్తానన్నాడనే ప్రచారంతో మైదకూరు టీడీపీ ఇన్ చార్జి , టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సర్దుకున్నారు. మైదకూరులో పోటీచేసేది తానేనని పుట్టా స్పష్టం చేశారు. డీఎల్ రవీంద్రరెడ్డి టీడీపీలోకి వచ్చేది పుకార్లేనని స్పష్టం చేశారు.

ఇవాళ సాయంత్రం చంద్రబాబు మైదకూరు అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు బాబును కలిసి చెప్పిస్తానన్నారు. దీంతో డీఎల్ ఆశలు అడియాశలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పుట్టాకు సర్ధి చెప్పి డీఎల్ ను చేర్చుకుందామని బాబు చేసిన ప్లాన్ బెడిసికొట్టినట్టైంది. పుట్టా పట్టుదలగా ఉండడంతో ఈ విషయంలో చంద్రబాబు ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తిగా మారింది.