Begin typing your search above and press return to search.
కమిటీలతో కేసీఆర్ కు కౌంటర్ రెడీ
By: Tupaki Desk | 19 Sep 2018 4:15 PM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరిన క్రమంలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహంతో ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో నెగ్గేందుకు ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేని ఆ పార్టీ తాజాగా కీలకమైన కమిటీల నియామకాన్ని ప్రకటించింది. పార్టీ ప్రధాన కమిటీతో పాటుగా కీలకమైన అనుబంధ కమిటీలన్నింటికీ...నియామకాలు పూర్తిచేసింది. తెలంగాణ పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను నియమించింది. కోర్ కమిటీ - కోఆర్డినేషన్ కమిటీ - క్యాంపెయిన్ కమిటీ - ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ - మేనిఫెస్టో కమిటీ - స్ట్రేటజీ అండ్ ప్లానింగ్ కమిటీ - ఎల్డీఎంఆర్సీ కమిటీ - ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ - డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పేరుతో అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. 9 అనుబంధ కమిటీలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించడంతో ఏఐసీసీ తాజాగా వెల్లడించారు.
కీలకమైన కోర్ కమిటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా - ఏఐసీసీ కార్యదర్శులు ఎన్.ఎస్. బోసురాజు - శ్రీనివాసన్ కృష్ణన్ - సలీం అహ్మద్ తో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క - జానారెడ్డి - షబ్బీర్ అలీ - వీ.హనుమంతరావు - పొన్నాల లక్ష్మయ్య - దామోదర రాజనర్సింహ - మధుయాష్కి గౌడ్ - జి. చిన్నారెడ్డి - ఎ. సంపత్ కుమార్ - వంశీచంద్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. అలాగే 53 మందితో ఏర్పడిన కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్ గా కుంతియా - కన్వీనర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి - మిగతా అన్ని కమిటీల చైర్మన్లు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - మాజీ మంత్రులు - మాజీ ఎంపీలు తదితరులు సభ్యులుగా ఉంటారు. క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క - కో-ఛైర్ పర్సన్ గా డీకే అరుణ - కన్వీనర్ గా దాసోజు శ్రవణ్ - మరో 14 మంది సభ్యులను నియమించారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో 41 మంది సభ్యులు - మరో 11 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. దీనికి పీసీసీ అధ్యక్షుడు నేతృత్వం వహిస్తారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ - కో-చైర్పర్సన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి - కన్వీనర్ గా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ - మరో 32 మంది సభ్యులు ఉంటారు. స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా వీ. హనుమంతరావు - కో-చైర్ పర్సన్ లుగా సర్వే సత్యనారాయణ - మధుయాష్కి గౌడ్ - శ్రీధర్ బాబు - కన్వీనర్ గా పొంగులేటి సుధాకర్ రెడ్డి - మరో 15 మంది సభ్యులను నియమించారు. ఎల్డీఎంఆర్సీ కమిటీ ఛైర్మన్ గా ఆరెపల్లి మోహన్ - కో-ఛైర్ పర్సన్ గా డి. రవీందర్ నాయక్ - కన్వీనర్ గా హెచ్. వేణుగోపాల్ రావు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి - కో-చైర్ పర్సన్ గా కమలాకర్ రావు - కన్వీనర్ గా జి. నిరంజన్ - మరో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎం. కోదండరెడ్డి - కో-ఛైర్ పర్సన్ గా ఏ. శ్యాంమోహన్ - కన్వీనర్ గా బి. కమలాకర్ రావు - నంది ఎల్లయ్య - సంభాని చంద్రశేఖర్ - పి. బలరాం నాయక్ - సీజే శ్రీనివాసరావులను నియమించారు.
కీలకమైన కోర్ కమిటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా - ఏఐసీసీ కార్యదర్శులు ఎన్.ఎస్. బోసురాజు - శ్రీనివాసన్ కృష్ణన్ - సలీం అహ్మద్ తో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క - జానారెడ్డి - షబ్బీర్ అలీ - వీ.హనుమంతరావు - పొన్నాల లక్ష్మయ్య - దామోదర రాజనర్సింహ - మధుయాష్కి గౌడ్ - జి. చిన్నారెడ్డి - ఎ. సంపత్ కుమార్ - వంశీచంద్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. అలాగే 53 మందితో ఏర్పడిన కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్ గా కుంతియా - కన్వీనర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి - మిగతా అన్ని కమిటీల చైర్మన్లు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - మాజీ మంత్రులు - మాజీ ఎంపీలు తదితరులు సభ్యులుగా ఉంటారు. క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క - కో-ఛైర్ పర్సన్ గా డీకే అరుణ - కన్వీనర్ గా దాసోజు శ్రవణ్ - మరో 14 మంది సభ్యులను నియమించారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో 41 మంది సభ్యులు - మరో 11 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. దీనికి పీసీసీ అధ్యక్షుడు నేతృత్వం వహిస్తారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ - కో-చైర్పర్సన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి - కన్వీనర్ గా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ - మరో 32 మంది సభ్యులు ఉంటారు. స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా వీ. హనుమంతరావు - కో-చైర్ పర్సన్ లుగా సర్వే సత్యనారాయణ - మధుయాష్కి గౌడ్ - శ్రీధర్ బాబు - కన్వీనర్ గా పొంగులేటి సుధాకర్ రెడ్డి - మరో 15 మంది సభ్యులను నియమించారు. ఎల్డీఎంఆర్సీ కమిటీ ఛైర్మన్ గా ఆరెపల్లి మోహన్ - కో-ఛైర్ పర్సన్ గా డి. రవీందర్ నాయక్ - కన్వీనర్ గా హెచ్. వేణుగోపాల్ రావు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి - కో-చైర్ పర్సన్ గా కమలాకర్ రావు - కన్వీనర్ గా జి. నిరంజన్ - మరో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎం. కోదండరెడ్డి - కో-ఛైర్ పర్సన్ గా ఏ. శ్యాంమోహన్ - కన్వీనర్ గా బి. కమలాకర్ రావు - నంది ఎల్లయ్య - సంభాని చంద్రశేఖర్ - పి. బలరాం నాయక్ - సీజే శ్రీనివాసరావులను నియమించారు.