Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ కు ఈసీ ఇచ్చిన తాజా షాక్ ఇది

By:  Tupaki Desk   |   20 Oct 2018 4:52 PM GMT
టీఆర్ ఎస్‌ కు ఈసీ ఇచ్చిన తాజా షాక్ ఇది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు షాకుల మీద షాకులు ఎదుర‌వుతున్నాయి. ఓ వైపు ఆ పార్టీకి చెందిన అభ్యర్థుల‌కు వ్య‌తిరేకంగా అస‌మ్మ‌తి గ‌ళం తెర‌మీద‌కు వ‌స్తుంటే....మ‌రోవైపు అనూహ్య రీతిలో ఆ పార్టీకి చెందిన అభ్య‌ర్థులు ఇర‌కాటంలో ప‌డిపోతున్నారు. తాజాగా కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే - టీఆర్ ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌ పై కేసు నమోదైంది. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు పోలీసులు గంగుల కమలాకర్‌ పై కేసు నమోదు చేశారు.

బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌ ను చంపుతానని గంగుల కమలాకర్‌ బెదిరించారు. ఇటీవ‌ల ఓ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ ``బిడ్డా రాజకీయం పక్కన పెడితే నిన్ను వేసేసేందుకు ఒక్క నిమిషం కూడా పట్టదు ఏమనుకుంటున్నావో. ప్రజలు న‌న్ను గెలిపించారు కాబట్టి ఓపికతో ఉంటే నన్ను గెలుకుతావు... నీ సంగతి చెప్తా ఏమనుకుంటున్నావో... ఒక్కసారి రాజకీయం పక్కకు పెడితే నీవు అవుటే` అంటూ గంగుల హెచ్చరించారు. బీజేపీ నేత బండి సంజయ్‌ని మీడియా సమావేశంలో బహిరంగంగా బెదిరింపులకు దిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు స్థానిక కలెక్టర్ విచారణ జరిపించి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ప‌రిణామం టీఆర్ఎస్‌కు షాక్ వంటిద‌ని అంటున్నారు.