Begin typing your search above and press return to search.

విమానంపై ప‌క్షుల దాడి..సైతాను చ‌ర్యే మ‌త‌పెద్ద‌!!

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:05 PM GMT
విమానంపై ప‌క్షుల దాడి..సైతాను చ‌ర్యే మ‌త‌పెద్ద‌!!
X
ఇంట‌ర్నెట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న వార్త‌ల ప్ర‌కారం...అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల్లో జోరుగా సాగుతున్న ప్ర‌చారాన్ని బ‌ట్టి పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. రాబందుల వంటి భారీ పక్షులు బ్రిటిష్ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానాన్ని ఢీకొట్ట‌గా...స‌ద‌రు విమానం తీవ్రంగా దెబ్బ‌తింది. ఇంట‌ర్నెట్ లో ఉన్న స‌మాచారం ప్ర‌కారం చైనాలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అయితే ఈ ఘ‌ట‌న మతం రంగు పులుముకుంది.

మీడియా వార్త‌ల సారాంశం ప్ర‌కారం...క్రైస్త‌వులు మాత్ర‌మే ప్ర‌యాణిస్తున్న విమానాన్ని ఢీకొట్టిన రాబందులు..సాధార‌ణ ప్ర‌యాణికులు ఉన్న విమానంపై ఎలాంటి దాడికి పాల్ప‌డ‌లేదు. ఈ విమానంలోని క్రైస్త‌వుల బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న పాస్ట‌ర్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఈ ఘ‌ట‌న సైతాన్ చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ` ఈ రోజు ఉద‌యం మా విమానం టేక్ ఆఫ్‌ కు సిద్ధ‌మ‌వుతుండ‌గా..సైతాన్ రూపంలోని ప‌క్షులు విమానాన్ని ఢీకొట్టాయి. పైల‌ట్ స్థానంలోకి చొచ్చుకువచ్చేందుకు ఆ పక్షులు సిద్ధ‌మై త‌దుప‌రి ద‌శ‌లోనే విమానం ప‌డ‌గొట్టి కూల్చేయాల‌ని ప్ర‌య‌త్నం చేశాయి.``అని దైవాంశ సంభూతిడిగా చెప్పుకొన్న ఆ పాస్ట‌ర్ వివ‌రించారు.

ప్రపంచానికి సైతానుల ద్వారా వినాశనం త‌ప్ప‌ద‌నే ముప్పున‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు క్రైస్త‌వ సంస్థ‌లు పేర్కొన్నాయి. దైవాన్ని న‌మ్మ‌ని వామ‌ప‌క్ష పాల‌కులు ఉన్న చైనాలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.