Begin typing your search above and press return to search.
జంపింగ్ ల విషయంలో బాబుకు ఓ లెక్క ఉంది
By: Tupaki Desk | 17 Oct 2017 6:52 AM GMTప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైతే తలెత్తే రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు అధికార టీడీపీ సైతం సిద్ధమవుతోంది. జగన్ పాదయాత్ర చేస్తే వచ్చే నష్టం పెద్దగా లేకపోయినా ఆయనను మానసికంగా దెబ్బతీయడానికి వైకాపా నుంచి చేరికలు తోడ్పడతాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేతలందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పార్టీ కండువా కప్పాలని భావిస్తున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే వైకాపాకు చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీ తీర్థం పుచ్చుకోవడంలో నెలకొన్న అస్పష్టతకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
అయితే జంపింగ్ లో భాగంగా పెద్ద జాబితానే ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు - అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేత ఒకరు - చిత్తూరు జిల్లాలో ఇద్దరు - ముగ్గురు వైకాపా నాయకులు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైకాపా నుంచి టీడీపీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న ఎంపి - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులకు అధినేత చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. పార్టీని వీడి అధికారం కోసం వెళ్తున్నారన్న అంశాన్ని జనంలోకి వైకాపా సమర్థవంతంగా తీసుకుపోగలిగితే జగన్ పాదయాత్రకు అనుకున్నంత మైలేజీ వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీలో జరిగే పరిణామాలను పట్టించుకుని సరిదిద్దుకునే సమయం ఉండదని టిడిపి నేతలు భావిస్తున్నారు. వైకాపాలో నేతలు జగన్ మినహా ఇతర నేతలతో చర్చించి సంతృప్తి చెందే పరిస్థితుల్లో లేరని, అదే సమయంలో 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చే హామీకి ఇతరులు ఇచ్చే హామీకి చాలా తేడా ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు - ఎంపీలు అంటున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎత్తుగడ వెనుక లాజిక్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. విడతల వారీగా వైకాపా నుంచి టీడీపీలో చేర్చుకోవడం ద్వారా జగన్ దృష్టిని పాదయాత్ర నుంచి పార్టీని కాపాడుకునే వైపు మళ్లించవచ్చని..తద్వారా యాత్రను భగ్నం చేయవచ్చన్నది టీడీపీ యోచనగా తెలుస్తోంది. కీలకమైన పాదయాత్రను నెత్తిన ఎత్తుకొని...అధికార టీడీపీ ఎత్తుగడలను వైసీపీ నేత జగన్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.
అయితే జంపింగ్ లో భాగంగా పెద్ద జాబితానే ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు - అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేత ఒకరు - చిత్తూరు జిల్లాలో ఇద్దరు - ముగ్గురు వైకాపా నాయకులు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైకాపా నుంచి టీడీపీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న ఎంపి - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులకు అధినేత చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. పార్టీని వీడి అధికారం కోసం వెళ్తున్నారన్న అంశాన్ని జనంలోకి వైకాపా సమర్థవంతంగా తీసుకుపోగలిగితే జగన్ పాదయాత్రకు అనుకున్నంత మైలేజీ వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీలో జరిగే పరిణామాలను పట్టించుకుని సరిదిద్దుకునే సమయం ఉండదని టిడిపి నేతలు భావిస్తున్నారు. వైకాపాలో నేతలు జగన్ మినహా ఇతర నేతలతో చర్చించి సంతృప్తి చెందే పరిస్థితుల్లో లేరని, అదే సమయంలో 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చే హామీకి ఇతరులు ఇచ్చే హామీకి చాలా తేడా ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు - ఎంపీలు అంటున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎత్తుగడ వెనుక లాజిక్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. విడతల వారీగా వైకాపా నుంచి టీడీపీలో చేర్చుకోవడం ద్వారా జగన్ దృష్టిని పాదయాత్ర నుంచి పార్టీని కాపాడుకునే వైపు మళ్లించవచ్చని..తద్వారా యాత్రను భగ్నం చేయవచ్చన్నది టీడీపీ యోచనగా తెలుస్తోంది. కీలకమైన పాదయాత్రను నెత్తిన ఎత్తుకొని...అధికార టీడీపీ ఎత్తుగడలను వైసీపీ నేత జగన్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.