Begin typing your search above and press return to search.

ఇక్కడ పబ్లిసిటీ పిచ్చి- అక్కడ పనులు చేసే కచ్చి

By:  Tupaki Desk   |   28 Aug 2016 4:33 AM GMT
ఇక్కడ పబ్లిసిటీ పిచ్చి- అక్కడ పనులు చేసే కచ్చి
X
కృష్ణా పుష్కరాలు అయిపోయిన తర్వాత మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. చాలా చురుగ్గా కదులుతూ..ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందాలు - కార్యాచరణ సిద్ధం చేసేస్తోంటే.. ఇక్కడ చంద్రబాబునాయుడు తన తెలివితేటలు - తన టెక్నాలజీ గురించి డబ్బా కొట్టుకోడానికి, కృష్ణా పుష్కరాల్ని టెక్నాలజీ ద్వారా ఎలా నిర్వహించిందీ చాటుకోవడానికీ ఇంకా శ్రద్ధ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.

అయినా చంద్రబాబు ఓపికకు మెచ్చుకోవాలని జనం నిర్ఘాంత పోతున్నారంటే అందులో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు! ఎందుకంటే.. ఆయన అన్ని టీవీ ఛానెల్స్‌ కు - అన్ని పేపర్లకు ఇంటర్వ్యూలు ఇస్తూన్నారు. నిజానికి అందరికీ చెబుతున్నది ఒకే విషయం. తాను టెక్నాలజీ ని ఎలా వాడుతున్నాను. తన కమాండ్‌ కంట్రోల్‌ అనేది ఎంత అద్భుతం. దీనిద్వారా రాష్ట్రమంతా ఎలా పరుగులు పెట్టించబోతున్నాను. కైజిల్లా యాప్‌ ఎలా పనిచేస్తుంది. ఇది తాను ఎలా వాడేస్తున్నాను. అనే సంగతులనే ఆయన అందరికీ చెబుతున్నారు. ఒకే విషయాన్ని పది మందికి పదిసార్లు చెప్పాలంటే.. సంతోషం సినిమాలో బ్రహ్మానందం కామెడీ ఎపిసోడ్‌ లాగా ఎవరికైనా చిరాకు పుట్టాలి. కానీ చంద్రబాబు చాలా ఇష్టంగా ఓపిగ్గా ఆ పని చేస్తున్నారంటే.. పబ్లిసిటీ మీద ఆయనకు ఎంత పిచ్చిమోజు ఉన్నదో అర్థమవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

ఎవరికి వారు ఎక్స్‌ క్లూజివ్‌ ఇంటర్వ్యూలు అంటే ప్రయారిటీ ఇచ్చి వేస్తారనేది చంద్రబాబు ఆశ. నిజానికి అన్ని మీడియాల్లో రావాలనుకున్నప్పుడు ఒక ప్రెస్‌ మీట్‌ పెడితే సరిపోతుంది. కానీ.. అలాగైతే.. న్యూస్‌ ప్రయారిటీ తక్కువ వస్తుందని ఆయన వ్యూహం. మరీ పబ్లిసిటీ కోసం ఇంతగా వెంపర్లాడిపోతున్నారేంటా అని జనం ఆశ్చర్యపోతున్నారు.