Begin typing your search above and press return to search.

ఈసారి బాబు హైదరాబాద్ జర్నీ ఎవరి కోసమో తెలుసా?

By:  Tupaki Desk   |   4 May 2016 6:37 AM GMT
ఈసారి బాబు హైదరాబాద్ జర్నీ ఎవరి కోసమో తెలుసా?
X
మొన్నామధ్య ఏపీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఏపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తన మనమడితో కూడా గడిపేందుకు టైం లేకుండా పోతుందని.. ఆయన మనమడిని చాలా మిస్ అవుతున్నట్లు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా బాబును జేసీ పొగిడేయటం.. ఆ పొగడ్తలకు చంద్రబాబు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండటం తెలిసిందే. ఇదంతా బాబు తన మనమడ్ని ఎంతలా మిస్ అవుతున్నారన్న విషయం మీదనే కావటం గమనార్హం.

నిత్యం పనుల ఒత్తిడితో విపరీతంగా శ్రమిస్తున్న చంద్రబాబు మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లారు. బాబు ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉండగా.. చంద్రబాబు మాత్రం ఏపీ రాజధాని అమరావతిలో ఉండటం తెలిసిందే. మనమడు దేవాంశ్ తో కాసేపు గడపాలని అనిపించటం.. ఈ మధ్యకాలంలో మనమడ్ని చూసి చాలాకాలం కావటంతో చంద్రబాబు.. చిన్నారితో గడిపేందుకు తాజా జర్నీ పెట్టుకున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు.. మనమడితో గడిపి.. ఈ రోజు (బుధవారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలకు వెళ్లనుండటం గమనార్హం.