Begin typing your search above and press return to search.
మళ్లీ మాటలతో తమ్ముళ్లపై బాబు ఫైర్
By: Tupaki Desk | 24 May 2017 8:26 AM GMTక్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇప్పుడు చిత్రవిచిత్రంగా మారింది. బలమైన నేతగా చంద్రబాబును పలువురు అభివర్ణిస్తుంటే.. అందుకు భిన్నంగా ఆయన పార్టీ నేతలు మాత్రం ఆయన మాటల్ని అస్సలు పట్టించుకోకపోవటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో ఆయన మాటల్ని లెక్క చేయకుండా తమకు నచ్చిన రీతిలో నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాబుకు పెద్ద తలనొప్పిగా మారాయి.
కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న హత్య.. ప్రకాశం జిల్లాలో తమ్ముళ్ల తగులాట.. జిల్లాల అధ్యక్షుల ఎంపికలో అసంతృప్తి హద్దులు దాటటం.. ఎంపీ నాని లాంటి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం లాంటి వాటిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చేస్తున్నారు.
అధికారం చేతిలో ఉన్న వేళ.. ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? అంటూ సీరియస్ కావటమే కాదు.. ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని ఒప్పుకునేదే లేదని ఆయన తేల్చేశారు. క్రమశిక్షణ విషయంలో ఏ మాత్రం కట్టుదాటినా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. తాజాగా ముఖ్యమైన పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన బాబు.. వారందరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల కాలంలో పార్టీ నేతలు పలువురు ఇష్టారాజ్యంగా వ్యవహరించటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయటమే కాదు.. మార్పు వెనువెంటనే ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్ హత్యలో అసలు నిజాల్ని ప్రజల్లో కి తీసుకెళ్లాలన్న మాటను చెప్పటంతో పాటు.. ఆ హత్యపై జరుగుతున్న ప్రచారంపై నేతలకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాల్సింది పోయి.. అలా ఎలా ఊరుకుంటారని నిలదీసినట్లు సమాచారం.
ఇక.. బీజేపీతో పార్టీకున్న కమిట్ మెంట్ను స్పష్టంగా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. బీజేపీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తామని.. మిత్రధర్మాన్ని నేతలంతా పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్లుగా సమాచారం. సొంత నేతలే పార్టీని విమర్శిస్తే మాత్రం వారి విషయాన్ని ఊరుకోనని.. చర్యలు తప్పవని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ తరహా ఫైర్ బాబుకు మామూలుగా మారిందంటున్నారు. మాటలతో మండిపడటమే కాదు.. చేతలతో చర్యలు తీసుకుంటే తమ్ముళ్లు దారికి వస్తారన్న మాటన పలువురు లోగుట్టుగా వ్యాఖ్యలు చేసుకోవటం కనిపిస్తోంది.
కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న హత్య.. ప్రకాశం జిల్లాలో తమ్ముళ్ల తగులాట.. జిల్లాల అధ్యక్షుల ఎంపికలో అసంతృప్తి హద్దులు దాటటం.. ఎంపీ నాని లాంటి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం లాంటి వాటిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చేస్తున్నారు.
అధికారం చేతిలో ఉన్న వేళ.. ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? అంటూ సీరియస్ కావటమే కాదు.. ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని ఒప్పుకునేదే లేదని ఆయన తేల్చేశారు. క్రమశిక్షణ విషయంలో ఏ మాత్రం కట్టుదాటినా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. తాజాగా ముఖ్యమైన పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన బాబు.. వారందరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల కాలంలో పార్టీ నేతలు పలువురు ఇష్టారాజ్యంగా వ్యవహరించటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయటమే కాదు.. మార్పు వెనువెంటనే ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్ హత్యలో అసలు నిజాల్ని ప్రజల్లో కి తీసుకెళ్లాలన్న మాటను చెప్పటంతో పాటు.. ఆ హత్యపై జరుగుతున్న ప్రచారంపై నేతలకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాల్సింది పోయి.. అలా ఎలా ఊరుకుంటారని నిలదీసినట్లు సమాచారం.
ఇక.. బీజేపీతో పార్టీకున్న కమిట్ మెంట్ను స్పష్టంగా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. బీజేపీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తామని.. మిత్రధర్మాన్ని నేతలంతా పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్లుగా సమాచారం. సొంత నేతలే పార్టీని విమర్శిస్తే మాత్రం వారి విషయాన్ని ఊరుకోనని.. చర్యలు తప్పవని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ తరహా ఫైర్ బాబుకు మామూలుగా మారిందంటున్నారు. మాటలతో మండిపడటమే కాదు.. చేతలతో చర్యలు తీసుకుంటే తమ్ముళ్లు దారికి వస్తారన్న మాటన పలువురు లోగుట్టుగా వ్యాఖ్యలు చేసుకోవటం కనిపిస్తోంది.