Begin typing your search above and press return to search.

యూటర్న్ లు కొత్తేమి కాదు బాబుగారికి!

By:  Tupaki Desk   |   14 Oct 2019 11:30 AM GMT
యూటర్న్ లు కొత్తేమి కాదు బాబుగారికి!
X
అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు.. అందరిని తొక్కుకుంటూ తాను ఎదిగానని. చంద్రబాబుకు కూడా అది సరిగ్గా సరిపోతుంది. తాను రాజకీయంగా అభివృద్ధి లోకి రావాలంటే తనను నమ్ముకున్నవాళ్లను ముంచేయటంలో అయనకి సాటి ఎవరు రారు. కావాలని అధికారం అప్పచెప్పి తన పని అయిపోగానే అక్కడనుంచి తోసిపారేయటం బాబుగారికి అలవాటైన పని. తాను తిట్టిపోసిన కాంగ్రెసుతోనే మళ్ళీ అంటకాగాడు.

కాంగ్రెస్ తో పొత్తుకోసం మోడీని నానాతిట్లూ తిట్టాడు. ఇపుడు మళ్ళీ కాంగ్రెస్ కు హ్యాండిచ్చి మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపి కి దగ్గరకావాలని కొత్తకుట్రలకు సిద్దమవుతున్నాడు..బాబును నమ్మిన కాంగ్రెస్ కి ఈ యూ టర్న్ కొత్త షాకునిస్తోంది..అయితే ఓ వైపు ఏపి బీజేపి ఇంచార్జ్ వున్న సునీల్ దియోధరా మాత్రం బాబు ను ఎట్టి పరిస్థితులలో కూడా బాబు తీసుకోవాలనుకుంటున్న యూటర్న్ కి గేట్ లు క్లోజ్ చేసామని చెబుతున్నాడు..అయినా బాబు యూటర్న్ ప్రయత్నాలు - లాబీయింగ్ మాత్రం సుజనా చౌదరి ద్వారా నడుస్తూనే వుందని టీడిపి నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో మోడీని - అమిత్ షాను రాయకూడని భాషలో తిట్టిన తాము మళ్లీ బీజేపి ను పొగడ్తూ మాటాడాలంటే సిగ్గుగా వుందని యూటర్న్ పై మదనపడుతున్నారు.

రాజకీయంగా యూటర్న్ లే కాదు - ప్రత్యేక హోదాపై - రాష్ట్రాభివృద్ధిపై టర్న్ లపై యూటర్న్ లు తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు తన హయాం లో భుజాలకెతుకున్న కాంట్రాక్టర్లను - వ్యాపారవేత్తలపై కూడా యూ టర్న్ లు తీసుకుంటూ తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంటున్నారని పారిశ్రామికవేత్తలు ఆయన ధోరణి పై మండిపండుతున్నారు..పోలవరం కాంట్రాక్ట్ పనులను ఓ పత్రికాధిపతి అధినేత వియ్యంకుడైన నవయుగ కంపెనీకు ఇవ్వడం వల్ల అప్పట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి తీని డబ్బాకొట్టాడు.అయితే బాబు నిర్ణయంవల్ల పోలవరం పనుల్లో నవయుగ భారీగా నష్టపోయిందనే నిజాలూ ఉన్నాయి.

ఇక పట్టి సీమ, ముచ్చుమర్రి,పురుషోత్తమ పట్నం పోర్ట్ - కృష్ణ - గోదావరి - పెన్నానదుల అనుసంధానం - కొండవీటి వాగు ప్రాజెక్టు పనులను మేఘా కృష్ణారెడ్డి కి అప్పజెప్పాడు చంద్రబాబు. 2016 జూలై 6 న ఘనంగా పట్టిసీమను ప్రారంభించాడు. పట్టి సీమను సకాలంలో పూర్తి చేసినందుకు మేఘా కృష్ణా రెడ్డిని కూడా భారీ బహిరంగ సభ పెట్టి సన్మానించాడు చంద్రబాబు.పట్టిసీమ పనులు జరిగినప్పుడు చైనా మోటర్స్ తో - చైనా టెక్నాలజీ తో ప్రాజెక్ట్ పూర్తి చేసామని ఘనంగా చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారిన వెంటనే చైనా మోటర్స్ పైనా , ఆ టెక్నాలజీ వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందన్న బిల్డప్ ఇస్తూ అభివృద్ధి పనులపై మళ్లీ యూటర్న్ లు తీసుకోవడం వంటిహేయమైన చర్య ఆయనకే చెల్లిందని పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

తన పచ్చమీడియా - సోషల్ మీడియా భజనబృందాలతో పారిశ్రామికవేత్త లపై విషం కక్కిస్తూ మోసగించడంలో కొత్త యూటర్న్ తీసుకున్నాడు. బాబు కు యూటర్న్ లు కొత్తకాదు..యూటర్న్ కు బాబు కూడా కొత్త కాదు. అయితే నిజాన్ని చెప్పే అలవాటు ఏ రోజు చంద్ర బాబుకు అలవాటు లేదన్నది జనమెరిగిన సత్యం.. నాలుగునెలలకే తన అనుభవాన్ని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేసే చంద్రబాబు ఎప్పుడు ఏ యూటర్న్ తీసుకున్నా అది తన లాభానికే -పచ్చ జాతికి తప్ప జనానికి ఉపయోగపడేది కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం పడుతున్నారు. యూటర్న్ అనేపదం కూడా తన వ్యక్తిత్వాన్ని- సహజత్వాన్ని వదులుకునేలా చంద్రబాబు ప్రవర్తిస్తుండటంతో ఇప్పుడు రోడ్లపై యూటర్న్ లు మాయమై బాబు ఫోటోలతో నిండిపోయాయి.