Begin typing your search above and press return to search.

అందుకే..డెయిరీ పెట్టా..భువనేశ్వరిని పెళ్లాడా

By:  Tupaki Desk   |   22 March 2017 12:10 PM GMT
అందుకే..డెయిరీ పెట్టా..భువనేశ్వరిని పెళ్లాడా
X
మైకు కనిపిస్తే చాలు.. పురాణమంతా చెప్పేసే అలవాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతకంతకూ ఎక్కువవుతోంది. మీద పడుతున్న వయసు ప్రభావమో.. చుట్టూ తన వాళ్లు అంతమంది ఉన్నా.. ఎవరూ కూడా పొగడని వేళ.. తనను తాను పొగుడుకునే తీరు రోజు రోజుకీ పెరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు షురూ అయిన నాటి నుంచి రోజుకు ఒక్కసారైనా.. హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్ర గురించి చెప్పకుండా ఉండలేని చంద్రబాబు.. ఈ రోజు (బుధవారం) సభలో తన గొప్పతనాన్ని.. తన గతాన్ని సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టిన ఆయన.. రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లో ఉన్న కుటుంబం కావటంతో ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకే తాను అప్పట్లోనే డెయిరీ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లుగా చెప్పారు.మొదట్లో తానే ఆ వ్యాపారాన్ని చూసుకున్నట్లుగా చెప్పిన చంద్రబాబు.. మంత్రి పదవి లభించిన తర్వాత వ్యాపారాన్ని భార్యకు అప్పగించినట్లుగా చెప్పారు. మొదట్లో రాజకీయాలు.. పార్టీ వ్యవహారాలు.. వ్యాపారాన్నితానే చూసుకునే వాడినని చెప్పిన చంద్రబాబు.. చదువుకుంటూనే పాలిటిక్స్ లోకి వచ్చానన్నారు.

వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత రెండేళ్ల పాటు అసెంబ్లీ అయిపోయిన తర్వాత పార్టీ పనులు చూసుకుంటూ..వ్యాపారానికి గంట సమయాన్నికేటాయించినట్లుగా వెల్లడించారు చంద్రబాబు. తన భార్యకుబిజినెస్ అప్పగించాక.. గడిచిన 24 ఏళ్లుగా వ్యాపార బాధ్యతల్నిఆమె చూసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో ఎవరికి కూడా అభద్రతాభావం లేదన్నానరు. స్వయంశక్తితో ఎదిగిన తన ఎదుగుదలను చూసిన తర్వాత.. ఎన్టీఆర్ తన కుమార్తెను ఇవ్వాలని అనుకున్నారని..తన కుమార్తెను పెళ్లి చేసుకుంటారా?అంటూ తనను కోరిన విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించారు.

తన రాజకీయ జీవితంలో ఇలాంటి విపక్షాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అనుసరిస్తున్న తీరుతో అసెంబ్లీ సమయం వృధా అవుతుందన్నారు. సభలో తాము చెప్పినట్లుగానే జరగాలని కోరుకోవటం సరికాదన్న చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పు పట్టారు. తాను విపక్ష నేతగా ఉన్నకాలంలో మైకు కోసం పోరాటం చేయాల్సి వచ్చేదని.. కానీ..ఇప్పుడు మాత్రం విపక్షం అడగకున్నానే మైకు ఇస్తున్నట్లుగా చెప్పుకున్నారు (అదే నిజమైతే..మైకు కోసం విపక్ష నేతలు అంతగా ప్రాధేయపడాల్సిన అవసరం అంతకంతకూ ఎందుకు వస్తున్నట్లో?) హైదరాబాద్ లోని ఏ మూలకు వెళ్లినా తాను చేసిన అభివృద్ధి కనిపిస్తోందన్న చంద్రబాబు.. 11 చార్జిషీట్స్ ఉన్న విపక్షనేత తనపై ఆరోపణలు చేయటం ఏమిటి? అని ప్రశ్నించారు. (విపక్ష నేత విమర్శిస్తారే కానీ.. పొగిడేస్తూ కూర్చోరు కదా? అన్న పాయింట్ ఎందుకు మిస్ అవుతారో..?) ప్రధానమంత్రిని ఎంపిక చేసే అవకాశం తనకు దక్కిందన్న బాబు.. ఆ విషయానికి తాను సంతోషపడుతున్నట్లు చెప్పారు.(ఇదే విషయాన్ని ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పటాన్ని మర్చిపోకూడదు) ప్రజాసేవ తప్పించి.. మరో ధ్యాస తనకు ఉండదని చెప్పిన చంద్రబాబు విపక్షంపై విసుర్లు విసురుతూ.. తనను పొగుడుకుంటూ సుదీర్ఘంగా స్పీచ్ ఇవ్వటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/