Begin typing your search above and press return to search.

మా భవిష్యత్తు..నీ భరోసా అంటే ఇదేనా బాబూ?

By:  Tupaki Desk   |   14 March 2019 4:49 PM GMT
మా భవిష్యత్తు..నీ భరోసా అంటే ఇదేనా బాబూ?
X
చంద్ర‌బాబు అంటే అభివృద్ధి... ప‌బ్లిసిటీ ఊద‌ర‌గొట్టే టీడీపీ ప్ర‌భుత్వం... మీ ఖ‌ర్చుల లెక్క‌లు చెప్ప‌మంటే మాత్రం నీళ్లు న‌ములుతుంది. కేంద్రం లెక్క‌లు అడిగితే... మ‌మ్మ‌ల్నే లెక్క‌లు అడుగుతారా? అంటారు బాబు. స‌రే ప్ర‌జ‌ల‌కు చెప్ప‌మంటే మాత్రం... ఏవీ ఏక‌బిగిన చెప్ప‌రు. అపుడొక‌టి ఇపుడొక‌టి క‌ల‌గాపులగం చేసి చెబుతారు. మీ క‌ర్మ అడిగారు కాబ‌ట్టి కూచుని క‌లుపుకుని లెక్కేసుకుని తేల్చుకోండి అన్న‌ట్టు ఉంటుంది. కానీ అన్ని అంశాలు అక్క‌ర్లేదు బియ్యం ఉడికిందా లేదా అని రెండు మెతుకులు ప‌ట్టి చూస్తే తెలిసిన‌ట్టు... చంద్ర‌బాబు గొప్ప‌ల‌ను కేవ‌లం కొన్నిటిని ప‌రిశీలిస్తే బాబు అభివృద్ధి లెక్క‌ల్లో డొల్ల‌త‌నం మొత్తం బ‌య‌ట‌ప‌డుతుంది. బాబొస్తే జాబు రాలేదు... క‌నీసం ఉన్న వృద్ధి రేటు కూడా వంక‌ర్లు తిరిగిన ప‌రిస్థితి. బాబు ద‌గా పాల‌న‌కు అర్థం ప‌ట్టే కొన్ని చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌లు ఇవి.

(1) గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పరిశ్రమ రంగం వాటా 25.21% నుంచి 22.1% దిగజారిందనేది మీ శ్వేతపత్రమే చెబుతుంది. అదేవిధంగా సేవారంగ వాటా కూడా 44.6% నుండి 43.5% దిగజారింది. మరి దీనినీ అభివృద్ధి అని ఎలా అంటారో ఏ ఆర్థిక నిపుణునికి అర్ధం కాదు. దీనినిబట్టి చూస్తే నీపైన భరోసా ఏవిధంగా కలుగుతుంది.

(2) తలసరి ఆదాయం 2003-04 మరియు 2013-14 మధ్యకాలంలో రూ. 25,959 నుంచి రూ. 85,795లుగా నమోదైంది. అంటే దాదాపు 335% పెరిగింది. ప్రతి 5 సంవ‌త్స‌రాల‌ తలసరి ఆదాయం తీసుకుంటే 165% అవుతుంది. నీ పరిపాలనలో గత 4 సంవ‌త్స‌రాల్లో కేవలం 71% మాత్రమే పెరిగిందని శ్వేతపత్రంలో చెప్పారు కదా. అది వరకుతో పోలిస్తే ఇది సగంకంటే తక్కువ పెరుగుదల రేటు కదా! మరి దీనిని చూస్తే నీపై భరోసా ఎలా కలగుతుందో మీరే చెప్పాలి.

(3) ఉమ్మడి రాష్ట్రంలో 200405 మధ్యలో పన్నుల ఆదాయం రూ. 16,250 కోట్ల నుండి రూ.64,124 కోట్లు పెరిగింది కదా అంటే 390% అయిదు సంవ‌త్స‌రాల సగటు తీసుకుంటే 195% మరి నీ పరిపాలనలో పెరుగుదల రేటు కేవలం 30% కూడా నమోదు కాలేదు. ఇదేనా నీవిచ్చే భరోసా.

(4) కేవలం 5 సంవ‌త్స‌రాలలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచెత్తింది నీవు కాదా. అందుకే నీ జమానాలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పును 29.5% పట్టుకొచ్చావు. దీన్ని 20.28% తగ్గించటానికి 10 సంవ‌త్స‌రాల కాలం పట్టింది. నీవు చేసిన అప్పువల్ల 200405లో 16.5% బడ్జెట్ కేటాయింపు కేవలం అప్పులకే పోయింది. మరల కేవలం 5 సంవ‌త్స‌రాల్లో అప్పును రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 29% పెంచుటమే కాకుండా లక్ష కోట్లు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వ ఏజన్సీల ద్వారా అదనంగా లక్ష కోట్లు అప్పు చేసి మొత్తం 3 లక్షల 50వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా అప్పుల ఊబిలో పడేశావు తెలుగు ప్రజల మీద నీకు ఎంత కక్ష వుంటే మాత్రం ఇంత దారుణమా. ఈ లక్ష కోట్లతో కలిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 35% దాటించావు కదా! నీమీద ఇంకా భరోసా ఉంచితే మా ఒంటిమీద బట్టలు కూడా ఉండనీయవు కదా!

(5) ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు నీవు చేసిందేమిటి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే చేసి గ్రాడ్యుయేషన్ - పోస్టు గ్రాడ్యుయేషన్ నిరుద్యోగ యువత జాతీయస్థాయిలో 12% వుంటే ఆంధ్రప్రదేశ్ లో 25.32% అని పబ్లిష్ చేయటం జరిగింది కదా! ఇదేనా ఇంటికో ఉద్యోగం అంటే. రాష్ట్ర విభజన నాటికి కేంద్రం వేసిన కమలనాధన్ కమిటీ ప్రకారం 1,50,000 ఖాళీలు ఎ.పి.లో ఉన్నాయి. ఈ 5 సంవ‌త్స‌రాల్లో పదవీ విరమణ చేసిన వాళ్ళు మరో 50,000 వెరసి మొత్తం 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మరి ఇవన్నీ నింపలేదనే నీపై భరోసా ఉంచాలా..

(6) 5 సంవత్సరాల్లో మొదటి సం. 37% - 2వ సంవ‌త్స‌రాల్లో 15% - 3వ సం.. లో 29.9%, 4వ సం.. లో 14.4% మరి ఈ యేడాది 31.8% వర్షపాతం నమోదయినది కదా. అంతకు ముందు మీ 9 సంవత్సరాల పరిపాలనలో కూడా మా గతి ఈ విధంగానే వుండేది కదా! మరి నీ పరిపాలన అంటేనే వరుణుడు భయపడతాడని నీమీద భరోసా ఉంచాలా.

(7) గత నాలుగు సంవత్సరాల నుంచి పప్పుధాన్యాలు - నూనెగింజలు - చిరుధాన్యాలకి కానీ కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేకపోయావు కదా! మీరి దేన్నిబట్టి నీపై భరోసా ఉంచాలి.

(8) ఐదు నక్షత్రాల హోటళ్లు - విద్య - వ్యాపార సంస్థలకు - సింగపూర్ విమానయానాలు చేసేవాళ్ళకి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి రైతులకు రావల్సినటువంటి ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేకపోయిన నీ సమర్థత చూసి మాకు భరోసా కలుగుతుందా.

(9) రైతులకు ఋణమాఫీ అని చెప్పి ఇంకా రూఐఐ 8,832 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా మేము బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ ఇంకా నీవు ఇవ్వవల్సిన దానికంటే ఎక్కువ మాచే కట్టించినందుకు నీపై భరోసా ఉంచాలా..

(10) డ్వాక్రా పొదుపు సంఘాలకు ఇవ్వవలసిన వడ్డీ రాయితీ వేలకోట్లు ఇవ్వకుండా పసుపుకుంకుమ పేరుతో కొద్ది సొమ్ము మాపై కొట్టినందుకు నీపై భరోసా ఉంచాలా..

(11) మా ఆధార్ కార్డు - సెల్ నెంబర్లు - బ్యాంకు ఖాతా నెంబర్లు - ప్రైవేటు సంస్థలకు చేరవేసిన నీపై భరోసా ఉంచాలా.

(12) రూ. 17,000 కోట్ల కేటాయింపులతో స్వర్గీయ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ పూర్తి అవుతాయి అని చెప్పి - 4 సంవ‌త్స‌రాలలో 50,000 కోట్లు పైచిలుకు ఖర్చుపెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని నీపై భరోసా ఉంచడం న్యాయమేనా.

(13) చ‌.అ. రూ.11,000 లలో తాత్కాలిక నిర్మాణాలు చేసి (అమరావతి) నటువంటి నీ సమర్ధతపై భరోసా ఉంచడం ఎవరికైనా తగునా.

(14) ఉచిత ఇసుక పేరుతో 10,000 కోట్లకు పైగా నీ పార్టీ నాయకులు - శాసన సభ్యులకు దోచిపెట్టిన నీ తెలివితేటలపై మాకు భరోసా కలుగునా.

(15) ప్రభుత్వ సంస్థల్ని కాదని ప్రైవేటు సంస్థలకు ఎయిర్ పోర్ట్ - సెజ్ భూములు సమర్ధించుకున్న మీపై భరోసా ఉంచడం సమంజసమా.

(16) ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో అన్ని రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఇళ్ళను - పక్క రాష్ట్రంకంటే చ.అ.కు రూ. 1000/ అదనంగా ఖర్చుచేసి ఆ అధనం ఖర్చు మీరు మిగుల్చుకొని అప్పు భారాన్ని మాపై నెడుతున్నందుకు మా భవిష్యత్తు గొప్పగా ఉంటుందని నీపై భరోసా ఉంచాలా బాబుగారు ?

(17) జన్మభూమి కమిటీల పేరుతో పంచాయితీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రభుత్వానికి పార్టీకి మధ్య అంతరాన్ని చెడిపేసినందుకా నీపై భరోసా.

(18) పైబర్ గ్రిడ్ పేరుతో రూ. 1,200/ ఖరీదు చేసే సెట్ ఆఫ్ బాక్సును రూ.4,000/లకు మాకు ఇస్తున్నందుకు మీపై భరోసా ఉంచాలా.

(19) పరిశుభ్రత లేదు ఎలుకల బెడద ఉన్నదని ఒక ఎలుకకు రూ.20,000/ చొప్పున కాంట్రాక్టర్లుకు దోచి పెట్టినందుకా నీపై భరోసా.