Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలు ... బాబుకు నిద్రలేని రాత్రులు !

By:  Tupaki Desk   |   6 Dec 2018 7:05 AM GMT
తెలంగాణ ఎన్నికలు ... బాబుకు నిద్రలేని రాత్రులు !
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. ఇటీవ‌లి కాలంలో ఇటు ఆఫ్ లైన్లో అటు ఆన్‌లైన్లో చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌డుతున్న విజ‌యసాయిరెడ్డి ట్వీట్ల‌ తో దుయ్య‌బ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ఎన్నికలకు రూ. 1200 కోట్లను చంద్రబాబు తరలించారంటూ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా తాజా గా మరోసారి అదే రీతిలో క‌ల‌క‌లం రేపే ట్వీట్ చేశారు. చంద్ర‌బాబు గ‌తం లో ప్ర‌క‌టించిన రూ.1200 కోట్ల‌కు అధ‌నంగా మ‌రో 500 కోట్ల రూపాయ‌లు పంపించేందుకు చంద్ర‌బాబు రెడీ అయ్యార‌ని ఆరోపించారు.

తెలంగాణ ఎన్నికల్లో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్.. డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మహాకూటమి పేరిట టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కలిసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా నిర్వహించారు. ఈ ప‌రంప‌రకు విజ‌యసాయిరెడ్డి త‌న మార్క్ ట్విస్ట్ ఇచ్చారు. ‘‘టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే చర్లపల్లి జైలు కు వెళ్లక తప్పదని చంద్రబాబు టెన్షన్ పడుతున్నాడు... ఓటు కు నోటు కేసు దర్యాప్తు చివరి దశకు వచ్చినందున నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు... రూ. 1200 కోట్లు సరిపోకపోతే మరో రూ. 500 కోట్లను ఏర్పాటు చేస్తానని నిన్న రాత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ని తన నివాసానికి పిలిపించుకుని మరీ చెప్పారు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ పై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.