Begin typing your search above and press return to search.

ఇంట్లో కూర్చోమ‌ని ప‌వ‌న్‌ కు నారాయ‌ణ స‌ల‌హా

By:  Tupaki Desk   |   27 Aug 2016 4:01 PM GMT
ఇంట్లో కూర్చోమ‌ని ప‌వ‌న్‌ కు నారాయ‌ణ స‌ల‌హా
X
సినీహీరో - జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుప‌తిలో బహిరంగ స‌భ‌లో ప్ర‌త్యేక హోదా విష‌యంలో నాయ‌కుల‌ను - ఎంపీల‌ను - కేంద్రాన్ని - పీఎం మోడీని - కేంద్ర మంత్రుల‌ను తూర్పార‌ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్ర‌త్య‌ర్థుల‌పై త‌న‌దైన చ‌మ‌క్కుల‌తో కూడిన సెటైర్లు వేసే సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ మ‌రోసారి ప‌వ‌న్‌ పై విమ‌ర్శ‌లు చేశారు.

ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ పొంగే పాలల్లో ఉప్పుగళ్లు వేసే తరహా వ్యక్తి అని నారాయణ ఎద్దేవా చేశారు. శ‌నివారం నారాయ‌ణ క‌డ‌ప జిల్లా రాజంపేట‌లో విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ ప‌వ‌న్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్‌ కు రాజ‌కీయాల‌ను మార్చాల‌న్న ఆలోచ‌న ఉంటేనే రాజ‌కీయాల్లోకి రావాల‌ని..అంతేకాని త‌న స్వార్థానికి అభిమానుల‌ను వాడుకోవ‌డం స‌రికాద‌ని... లేకుంటే సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్‌ లాగా ప‌వ‌న్ ఇంట్లో కూర్చుంటే మంచిద‌ని నారాయ‌ణ ఎద్దేవా చేశారు.

ఇక ప‌వ‌న్‌ పై నారాయ‌ణ విమ‌ర్శ‌లు ఇలా ఉంటే ప‌వ‌న్ మాత్రం ప్ర‌త్యేక హోదా కోసం పోరుబాట ప్రారంభిస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేశాడు. సెప్టెంబ‌ర్ 9న కాకినాడ‌లో త‌న తొలి స‌భ ఉంటుంద‌ని... త‌ర్వాత తాను అన్ని జిల్లాలు తిరుగుతాన‌ని ప‌వ‌న్ చెప్పాడు.