Begin typing your search above and press return to search.

కత్తి పోట్లతో బయటకు వచ్చిన పేగులు..చొక్కాలో దోపుకుని పోలీస్‌ స్టేషన్‌ కు పరుగు

By:  Tupaki Desk   |   27 Jun 2019 6:41 AM GMT
కత్తి పోట్లతో బయటకు వచ్చిన పేగులు..చొక్కాలో దోపుకుని పోలీస్‌ స్టేషన్‌ కు పరుగు
X
హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ కు కూత వేటు దూరంలో దారుణం జరిగింది. ఇద్దరు ఆటో డ్రైవర్ల మద్య గొడవ పెరిగి పెద్దది అయ్యి ఒక డ్రైవర్‌ మరో డ్రైవర్‌ ను కత్తితో పొడిచే వరకు వచ్చింది. కత్తితో పొడవడంతో బాధితుడి పేగులు బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన పేగులను షర్ట్‌ లోపలకు అనుకుని పక్కనే ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లి పడిపోయాడు. ఈ సంఘటన రోడ్డు మీద ఉన్న వారితో పాటు పోలీసులను కూడా భయబ్రాంతులకు గురి చేసింది.

సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బడీ మజీద్‌కు చెందిన అన్వర్‌ మరియు నాగార్జున హిల్స్‌ కు చెందిన మీర్‌ రియాసత్‌ అలీ సజ్‌ లు ఇద్దరు ఆటో డ్రైవర్స్‌. వీరిద్దరు కూడా గతంలో మంచి స్నేహితులుగా మెలిగేవారట. అయితే కారణం ఏంటో తెలియదు కాని గత కొంత కాలంగా వీరిద్దరు తరచు గొడవ పడుతూ వస్తున్నారు. వారం రోజుల క్రితం కూడా వీరిద్దరు కొట్టుకున్నారట. నాలుగు అయిదు సార్లు గొడవ పడ్డ సమయంలో తోటి డ్రైవర్లు వీరిద్దరిని విడిపించడం జరిగిందట. అయితే నిన్న సాయంత్రం సమయంలో అన్వర్‌ ను చంపేయాలనే ఉద్దేశ్యంతో రియాసత్‌ కత్తి తీసుకుని వచ్చేశాడు.

నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇద్దరి మద్య మాట మాట పెరిగింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న రియాసత్‌ తన వద్ద ఉన్న కత్తితో అన్వర్‌ ను పొడిచాడు. పొడిచిన తర్వాత అతడి కడుపును చీల్చాడు. దాంతో అన్వర్‌ కడుపులోని పేగులు బయటకు వచ్చాయి. వెంటనే అన్వర్‌ పేగులు షర్ట్‌ లోకి దోపుకుని అక్కడ నుండి పరిగెత్తుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకున్నాడు. అప్పటికి బతికే ఉన్న అన్వర్‌ ను పోలీసులు గాంధీకి తరలించారు. అయితే మార్గం మద్యలోనే అన్వర్‌ మృతి చెందాడు.

మరో వైపు హత్యకు పాల్పడ్డ రియాసత్‌ కూడా పోలీసు స్టేషన్‌ కు వెళ్లి లొంగి పోయాడు. తన భార్య పిల్లలకు హెచ్‌ ఐ వీ రక్తం ఎక్కించిన కారణంగా అన్వర్‌ ను హత్య చేసినట్లుగా రియాసత్‌ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రియాసత్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

రద్దీగా ఉండే పంజాగుట్ట ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. దాంతో చాలా సమయం వరకు ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయ్యింది.