Begin typing your search above and press return to search.
బాలకృష్ణపై సొంత నియోజకవర్గంలో అసంతృప్తి
By: Tupaki Desk | 12 Feb 2016 4:12 PM GMTసినీ నటుడు - హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహార శైలి పై ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చజరుగుతోంది. ఇటు రాష్ట్రంతో పాటు అటు హిందూపురంలోనూ ఏకకాలంలోను డిబేట్లు సాగడం...రెండుచోట్ల బాలయ్యబాబు వల్లే కావడం ఆసక్తికరం. త్వరలో జరగబోయే లేపాక్షి ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా హైదరాబాద్ మొదలు ఢిల్లీ వరకు ఆహ్వానాలు అందిస్తున్న బాలయ్య ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురాన్ని మాత్రం మర్చిపోయాడంటున్నారు.
ఇంతకీ బాలయ్య మీద సొంత నియోజకవర్గంలో అసంతృప్తి కలగడానికి కారణం ఏంటంటే అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి బాలకృష్ణ వెళ్లకపోవడమే! శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేగా బాలకృష్ణ హాజరుకావాల్సి ఉంది. అయితే బాలయ్యబాబు ఆ మీటింగ్ కు వెళ్లలేదు. దీంతో జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యుడు రవి... బాలకృష్ణ గైర్హాజరు ఎందుకు జరిగిందంటూ ప్రశ్నించాడు. అయితే ఈ ప్రశ్నవివాదంగా మారుతుందని గమనించిన మంత్రి పల్లె రఘనాథరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇతర కార్యక్రమాల వల్ల బాలకృష్ణ హాజరుకాలేకపోయారని చెప్పారు. పని ఒత్తిడి కారణంగా ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరుకాకపోవడం గతంలో కూడా జరిగిందని చర్చకు ఫుల్స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మంత్రి పల్లె జవాబుతో ఏకీభవించని జెడ్పీటీసీలు బాలయ్య బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరుకాని బాలయ్య ఖాళీగా ఏం లేరని చెప్తున్నారు. ఈనెల 27,28 తేదీల్లో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానాలు అందించడంలో హైదరాబాద్ టు ఢిల్లీ చుట్టేస్తున్నారు. తెలంగాణ మంత్రులు మొదలు కేంద్ర మంత్రుల వరకు అందర్నీ వేడుకకు రావాలని కోరుతున్నారు. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య జెడ్పీ సమావేశానికి రాకపోవడం స్థానిక ప్రజాప్రతినిధులకు ఆగ్రహానికి కారణంగా మారింది.
ఇంతకీ బాలయ్య మీద సొంత నియోజకవర్గంలో అసంతృప్తి కలగడానికి కారణం ఏంటంటే అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి బాలకృష్ణ వెళ్లకపోవడమే! శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేగా బాలకృష్ణ హాజరుకావాల్సి ఉంది. అయితే బాలయ్యబాబు ఆ మీటింగ్ కు వెళ్లలేదు. దీంతో జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యుడు రవి... బాలకృష్ణ గైర్హాజరు ఎందుకు జరిగిందంటూ ప్రశ్నించాడు. అయితే ఈ ప్రశ్నవివాదంగా మారుతుందని గమనించిన మంత్రి పల్లె రఘనాథరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇతర కార్యక్రమాల వల్ల బాలకృష్ణ హాజరుకాలేకపోయారని చెప్పారు. పని ఒత్తిడి కారణంగా ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరుకాకపోవడం గతంలో కూడా జరిగిందని చర్చకు ఫుల్స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మంత్రి పల్లె జవాబుతో ఏకీభవించని జెడ్పీటీసీలు బాలయ్య బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరుకాని బాలయ్య ఖాళీగా ఏం లేరని చెప్తున్నారు. ఈనెల 27,28 తేదీల్లో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానాలు అందించడంలో హైదరాబాద్ టు ఢిల్లీ చుట్టేస్తున్నారు. తెలంగాణ మంత్రులు మొదలు కేంద్ర మంత్రుల వరకు అందర్నీ వేడుకకు రావాలని కోరుతున్నారు. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య జెడ్పీ సమావేశానికి రాకపోవడం స్థానిక ప్రజాప్రతినిధులకు ఆగ్రహానికి కారణంగా మారింది.