Begin typing your search above and press return to search.

రాజకీయ విరాళాల్లో బీజేపీ టాప్

By:  Tupaki Desk   |   9 Feb 2016 10:44 AM GMT
రాజకీయ విరాళాల్లో బీజేపీ టాప్
X
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం... వారు కోరడం సహజమే. తాజాగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో అందిన మొత్తంపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ - నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు నివేదిక విడుదల చేశాయి. దాని ప్రకారం అత్యధిక స్థాయిలో విరాళాలు అందుకున్న పార్టీగా బీజేపీ నిలిచింది.

2014-15 ఏడాదికి సంబంధించి రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల లెక్కల్లో బీజేపీ 437 కోట్లతో టాప్ లో నిలవగా కాంగ్రెస్ పార్టీ 139 కోట్లు మాత్రం విరాళాలు అందుకుంది. కాగా బీజేపీకి వచ్చిన 437 కోట్లు 1234 మంది నుంచి వచ్చాయట. గత ఏడాదితో పోల్చితే బీజేపీకి వచ్చిన విరాళాలు భారీగా పెరగగా.. కాంగ్రెస్ కు భారీగా తగ్గాయి.

ఇక ఢిల్లీ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి 44 కోట్లు అందాయి. అయితే... తమకు విరాళాలు ఇచ్చినవారిలో 111 మందికి సంబంధించిన వివరాలను ఆప్ వెల్లడించలేదు. పారదర్శకతకు మారుపేరుగా చెప్పుకొనే ఆప్ ఇలా వారి వివరాలు వెల్లడించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీకి 39 కోట్లు విరాళాలు వచ్చాయి.