Begin typing your search above and press return to search.
థాయ్ రెస్క్యూ ఆపరేషన్ వెనుక షాకింగ్ నిజం!
By: Tupaki Desk | 12 July 2018 1:10 PM GMTజూన్ 23న థాయ్ లాండ్ లోని థామ్ లాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది జూనియర్ ఫుట్ బాల్ జట్టు సభ్యులు - కోచ్ లు ఎట్టకేలకు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఆ గుహలో చిక్కుకున్న 13మందిని నిపుణులైన 90 మంది జాతీయ - అంతర్జాతీయ డైవర్ల రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తెచ్చారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో, వారి వీడియోను తొలిసారిగా అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆస్పత్రి లో మాస్కులు ధరించి..చిరునవ్వులు చిందిస్తూ విజయ సంకేతం చూపుతోన్న ఆ చిన్నారుల వీడియో వైరల్ అయింది. అనేక తర్జనభర్జనల మధ్య అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ఆ చిన్నారులను బయటకు తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారిని బయటకు తెచ్చేందుకు అధికారులు....అత్యంత రిస్కీ ఆప్షన్ ను ఎంచుకున్నారని పుకార్లు వస్తున్నాయి. ఆ పిల్లలకు మత్తు మందు ఇచ్చి బయటకు తెచ్చామని నేవీ సీల్ ఒకరు చెప్పినట్లు థాయ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఆ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారుల వయసు....11 నుంచి 16 ఏళ్లలోపే. అదీగాక, వారంతా సూర్యుడిని చూడకుండా గుహలో దాదాపు 15 రోజులున్నారు. దీంతో, వారు పూర్తిగా బలహీనపడ్డారు. దానికి తోడు వారికి ఈత రాకపోవడం....గుహలో నీటిగుండా - ఇరుకైనా మార్గాల గుండా ప్రయాణించాల్సి ఉండడం...వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా తీసుకువస్తే పిల్లలు భయపడతారని - అందుకే మత్తు మందు ఇచ్చి బయటకు తెచ్చామని ఓ నేవీ సీల్ చెప్పినట్లు లోకల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఆ పిల్లల్లో కొందరు నిద్రపోయారని - కొందరు వేళ్లను కదిపారని ఆ అధికారి చెప్పారట. అయితే, దారి పొడవునా కొందరు వైద్యులు పిల్లల పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారని చెప్పారట. అయితే, గుహలో చిక్కుకున్న పిల్లల్లో ఒకరి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వారు లోపలికి వెళ్లేటప్పుడు పెద్దమొత్తంలో ఆహారం తీసుకెళ్లారట. ఆ ఆహారమే వారి ప్రాణాలను ఎక్కువ కాలం కాపాడిందని స్థానికులు అంటున్నారు. అయితే, పిల్లలను తొలిసారి గుర్తించిన డైవర్లలో ఒకరైన ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత అనస్థీషియన్ - రిచర్డ్ హ్యారిస్ గుహ లో నుంచి వచ్చిన చిట్టచివరి వ్యక్తిగా మిగిలారు. అయితే, అలా వచ్చిన కొద్దిసేపటికే తన తండ్రి మరణ వార్త తెలియడంతో స్వదేశానికి తిరిగి వెళ్లారు.
ఆ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారుల వయసు....11 నుంచి 16 ఏళ్లలోపే. అదీగాక, వారంతా సూర్యుడిని చూడకుండా గుహలో దాదాపు 15 రోజులున్నారు. దీంతో, వారు పూర్తిగా బలహీనపడ్డారు. దానికి తోడు వారికి ఈత రాకపోవడం....గుహలో నీటిగుండా - ఇరుకైనా మార్గాల గుండా ప్రయాణించాల్సి ఉండడం...వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా తీసుకువస్తే పిల్లలు భయపడతారని - అందుకే మత్తు మందు ఇచ్చి బయటకు తెచ్చామని ఓ నేవీ సీల్ చెప్పినట్లు లోకల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఆ పిల్లల్లో కొందరు నిద్రపోయారని - కొందరు వేళ్లను కదిపారని ఆ అధికారి చెప్పారట. అయితే, దారి పొడవునా కొందరు వైద్యులు పిల్లల పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారని చెప్పారట. అయితే, గుహలో చిక్కుకున్న పిల్లల్లో ఒకరి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వారు లోపలికి వెళ్లేటప్పుడు పెద్దమొత్తంలో ఆహారం తీసుకెళ్లారట. ఆ ఆహారమే వారి ప్రాణాలను ఎక్కువ కాలం కాపాడిందని స్థానికులు అంటున్నారు. అయితే, పిల్లలను తొలిసారి గుర్తించిన డైవర్లలో ఒకరైన ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత అనస్థీషియన్ - రిచర్డ్ హ్యారిస్ గుహ లో నుంచి వచ్చిన చిట్టచివరి వ్యక్తిగా మిగిలారు. అయితే, అలా వచ్చిన కొద్దిసేపటికే తన తండ్రి మరణ వార్త తెలియడంతో స్వదేశానికి తిరిగి వెళ్లారు.