Begin typing your search above and press return to search.

మోడీకి 3జీ పంచ్ వేసిన సీఎం

By:  Tupaki Desk   |   16 July 2018 7:26 AM GMT
మోడీకి 3జీ పంచ్ వేసిన సీఎం
X
ఎన్నిక‌ల‌కు దాదాపు ఏడాది స‌మ‌యం ఉన్నా.. ఆ మ‌ధ్య‌న ముంద‌స్తు అంటే హ‌డావుడి చేయ‌టం.. మీడియా సైతం దాన్ని ప‌ట్టుకొని సాగ‌దీయ‌టం.. విష‌యం అంత‌కంత‌కూ క్లిష్టంగా మారుతున్న వేళ‌.. ముంద‌స్తు లేదు.. షెడ్యూల్ ప్ర‌కార‌మే అంటూ క్లారిటీ ఇచ్చిన వైనంతో ఎన్నికలు ఎప్పుడున్న హ‌డావుడిని కాస్తంత త‌గ్గించింది. ఎన్నిక‌లు ఎప్పుడ‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చినా.. ఎన్నిక‌ల వేళ ఎలాంటి విమ‌ర్శ‌లు ఉంటాయో.. ఇప్పుడు అలాంటివే చేస్తూ వాతావ‌ర‌ణాన్ని వేడెక్కిస్తున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.

ఈ మ‌ధ్య‌నే కాంగ్రెస్ ముస్లిం పురుషుల పార్టీగా వ్యాఖ్యానిస్తూ.. ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో కాంగ్రెస్ తీరును తప్పుప‌ట్ట‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఇప్ప‌టికే త‌ప్పు ప‌ట్ట‌గా.. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ త‌న‌దైన రీతిలో మోడీకి పంచ్ వేశారు.

ప్ర‌పంచ‌మంతా 5జీ నెట్ వ‌ర్క్ తో దూసుకుపోతుంటే.. ప్ర‌ధాని మోడీ మాత్రం హిందూ.. ముస్లిం అంటూ వ్యాఖ్య‌లు చేస్తూ కాల‌క్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచ‌దేశాల్లో 5జీ నెట్ వ‌ర్క్ తో వేగంగా వెళుతోంద‌ని.. దేశంలో మాత్రం ఇప్ప‌టికి 3జీ స‌రిగా ప‌ని చేయ‌టం లేద‌న్నారు. హిందూ ముస్లింలు అంటూ ప్ర‌ధాని మ‌త వైష‌మ్యాల్ని సృష్టిస్తున్నార‌ని.. నాలుగేళ్ల కాలంలో ఆయ‌నేం అభివృద్ధి చేశారో చెప్పాల‌న్నారు.

కాంగ్రెస్ ముస్లిం పురుషుల పార్టీ అంటూ మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి స్పందించారు. రానున్న రోజుల్లో రాజ‌స్థాన్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లుచేస్తున్నార‌ని మండిప‌డ్డారు.