Begin typing your search above and press return to search.
మేజర్ భార్య హత్య కేసులో షాకింగ్ నిజాలు!
By: Tupaki Desk | 25 Jun 2018 9:46 AM GMTఅమ్మాయి చాలా బాగా నచ్చింది. కానీ.. ఆమెకు పెళ్లి అయిపోయింది. అయితేనేం.. ఏదో రకంగా ఒత్తిడి చేసి ఆమెతో అక్రమ సంబంధానికి తెర తీయటం.. ఆ తర్వాత అంతకు మించి.. అన్న దగ్గర ఇరువురికి విభేదాలు రావటం.. ఎవరో ఒకరు బలి కావటం ఈ మధ్యన చూస్తున్నదే. ఒకవేళ.. ఇద్దరూ కలిసి.. అడ్డుగా ఉన్న భర్తను కానీ భార్యను కానీ చంపేసి ఎంజాయ్ చేయాలన్న దుర్మార్గపు ప్లాన్లు వేయటం లాంటి ఉదంతాలు ఎన్నో చూశాం.
ఇదే తరహాలో మరో దారుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అది కూడా కంటోన్మెంట్ ప్రాంతంలో. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే సైన్యాధికారి ఒకరు చేసిన దుర్మార్గం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ హత్యోదంతానికి సంబంధించిన తాజాగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. అసలు.. ఈ హత్యకు ముందు ఏం జరిగింది? అన్నది చూస్తే..
ఆర్మీ మేజర్ అమిత్ ద్వివేది.. శైలజలు భార్యభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం అమిత్ నాగాలాండ్ లో పని చేసేవారు.ఆ సందర్భంగా అమిత్ కుటుంబానికి పరిచయమయ్యారు హండా. శైలజ పట్ల విపరీతమైన వ్యామోహాన్ని వ్యక్తం చేసేవాడు. శైలజతో వివాహేతర సంబంధాన్ని స్టార్ట్ చేశాడు. అదే సమయంలో అమిత్ కు ఢిల్లీకి బదిలీ అయ్యింది. భర్తతో పాటు శైలజ కూడా ఢిల్లీకి వచ్చేశారు. అయితే.. భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని హండా ఒత్తిడి చేసే వారు. కానీ.. ఆమె అందుకు అంగీకరించలేదు.
ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం శైలజ ఫిజియోథెరఫీ కోసం భర్త కారులో బయలుదేరారు. సైనిక ఆసుపత్రికి చేరుకున్న ఆమెను.. హండా ఆసుపత్రిలో కలిసినట్లుగా అక్కడి సీసీ కెమేరా ఫుటేజ్ లభ్యమైంది. తనను పెళ్లి చేసుకోవాలన్న హండా వాదనతో ఇరువురి మధ్య విభేదాలు రావటం.. అందుకు శైలజ సమ్మతించకపోవటంతో ఆమె గొంతు కోసి హత్య చేసిన హండా.. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆమె శరీరం మీద నుంచి తన వాహనాన్ని పోనిచ్చి.. తనలోని కర్కసత్వాన్నిప్రదర్శించారు.
అనంతరం ఆఫీసర్స్ మెస్ లో తలదాచుకునే ప్రయత్నం చేయగా.. అతడి కిరాతకం బయటకు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. శైలజ హత్య తర్వాత ఆమెకు చెందిన మెబైల్ రికార్డ్స్ ను పరిశీలిస్తే.. శైలజకు ఏడాది వ్యవధిలో దాదాపు మూడువేల సార్లు ఫోన్ చేసినట్లు గుర్తు చేశారు. కొన్నిసార్లు ఫోన్ కట్ చేయగా.. మరికొన్నిసార్లు మాట్లాడినట్లు గుర్తించారు.
తమ దర్యాప్తులో.. శైలజకు హండా ఫోన్ ను బహుమతిగా ఇచ్చినట్లు గుర్తించారు. శైలజను హతమార్చేందుకు స్విస్ దేశానికి చెందిన కత్తిని ఉపయోగించినట్లుగా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోవటానికి శైలజ అంగీకరించకపోవటంతోనే ఆగ్రహానికి గురైన హండా ఉన్మాదంతో ఆమెను మట్టుబెట్టినట్లుగా భావిస్తున్నారు. ఇదే.. విషయాన్ని దర్యాప్తు అధికారుల ఎదుట కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇదే తరహాలో మరో దారుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అది కూడా కంటోన్మెంట్ ప్రాంతంలో. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే సైన్యాధికారి ఒకరు చేసిన దుర్మార్గం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ హత్యోదంతానికి సంబంధించిన తాజాగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. అసలు.. ఈ హత్యకు ముందు ఏం జరిగింది? అన్నది చూస్తే..
ఆర్మీ మేజర్ అమిత్ ద్వివేది.. శైలజలు భార్యభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం అమిత్ నాగాలాండ్ లో పని చేసేవారు.ఆ సందర్భంగా అమిత్ కుటుంబానికి పరిచయమయ్యారు హండా. శైలజ పట్ల విపరీతమైన వ్యామోహాన్ని వ్యక్తం చేసేవాడు. శైలజతో వివాహేతర సంబంధాన్ని స్టార్ట్ చేశాడు. అదే సమయంలో అమిత్ కు ఢిల్లీకి బదిలీ అయ్యింది. భర్తతో పాటు శైలజ కూడా ఢిల్లీకి వచ్చేశారు. అయితే.. భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని హండా ఒత్తిడి చేసే వారు. కానీ.. ఆమె అందుకు అంగీకరించలేదు.
ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం శైలజ ఫిజియోథెరఫీ కోసం భర్త కారులో బయలుదేరారు. సైనిక ఆసుపత్రికి చేరుకున్న ఆమెను.. హండా ఆసుపత్రిలో కలిసినట్లుగా అక్కడి సీసీ కెమేరా ఫుటేజ్ లభ్యమైంది. తనను పెళ్లి చేసుకోవాలన్న హండా వాదనతో ఇరువురి మధ్య విభేదాలు రావటం.. అందుకు శైలజ సమ్మతించకపోవటంతో ఆమె గొంతు కోసి హత్య చేసిన హండా.. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆమె శరీరం మీద నుంచి తన వాహనాన్ని పోనిచ్చి.. తనలోని కర్కసత్వాన్నిప్రదర్శించారు.
అనంతరం ఆఫీసర్స్ మెస్ లో తలదాచుకునే ప్రయత్నం చేయగా.. అతడి కిరాతకం బయటకు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. శైలజ హత్య తర్వాత ఆమెకు చెందిన మెబైల్ రికార్డ్స్ ను పరిశీలిస్తే.. శైలజకు ఏడాది వ్యవధిలో దాదాపు మూడువేల సార్లు ఫోన్ చేసినట్లు గుర్తు చేశారు. కొన్నిసార్లు ఫోన్ కట్ చేయగా.. మరికొన్నిసార్లు మాట్లాడినట్లు గుర్తించారు.
తమ దర్యాప్తులో.. శైలజకు హండా ఫోన్ ను బహుమతిగా ఇచ్చినట్లు గుర్తించారు. శైలజను హతమార్చేందుకు స్విస్ దేశానికి చెందిన కత్తిని ఉపయోగించినట్లుగా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోవటానికి శైలజ అంగీకరించకపోవటంతోనే ఆగ్రహానికి గురైన హండా ఉన్మాదంతో ఆమెను మట్టుబెట్టినట్లుగా భావిస్తున్నారు. ఇదే.. విషయాన్ని దర్యాప్తు అధికారుల ఎదుట కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.