Begin typing your search above and press return to search.

ప్రేమికుడిపై యాసిడ్ దాడి చేసి చంపేసింది

By:  Tupaki Desk   |   24 May 2017 3:46 PM GMT
ప్రేమికుడిపై యాసిడ్ దాడి చేసి చంపేసింది
X
మేం స‌రిగానే రాశాం. మీరు స‌రిగానే చ‌దివారు. ప్రేమికుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ఆ దాడికి గురైన స‌ద‌రు యువ‌కుడు చ‌నిపోయాడు.! ఈ సంఘ‌ట‌న జ‌రిగింది గుంటూరు జిల్లా వెనిగండ్లలో. ప్రియుడిపై అంత కోపం ఆ అమ్మాయికి క‌లిగేందుకు కార‌ణం...ఆ అబ్బాయి మ‌రో అమ్మాయిని వివాహం చేసుకోవ‌డ‌మే!

స్థానికులు, బాధితులు, మీడియా క‌థ‌నం ప్ర‌కారం గుంటూరుకు చెందిన హిమబిందు, తాడికొండకు చెందిన ఇలియాజ్ ప్రేమికులు. అయితే వీరి ప్రేమ‌కు ఇలియాజ్ కుటుంబ స‌భ్యులు అభ్యంత‌రం చెప్పారు. దీంతో ఇలియాజ్ మ‌రో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ విష‌యం తెలిసి ర‌గిలిపోయిన హిమ‌బిందు యాసిడ్ దాడికి సిద్ధ‌మైంది. ఇలియాజ్‌తో ప‌రిచ‌యం ఉన్న ఖాసీంతో క‌లిసి ఆటో డ్రైవ‌ర్ అర్జున‌రావు ఇంటికి ప్రియుడిని హిమ‌బిందు పిలిపించింది. దీంతో అక్క‌డికి వెళ్లిన ఇలియాజ్‌ను బెడ్రూంలోకి పిలిచిన హిమ‌బిందూ ఆ స‌మ‌యంలోనే యాసిడ్ దాడి చేసింది.

ఒక్కసారిగా ఈ ఘ‌ట‌న‌కు షాక్ అయిన ఇలియాజ్ పెడ‌బొబ్బ‌లు పెడుతూ గోడ‌దూకి పరిగెత్తాడు. అయితే దొంగ అని భావించిన స్థానికులు ఆయ‌న్ను ప‌ట్టుకున్నారు. మండిపోతున్న శ‌రీరంతోనే తాము ప్రేమికుల‌మ‌నే విషయాన్ని ఇలియాజ్ వారికి వివ‌రించాడు. అనంత‌రం స్థానికులు ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మ‌రణించాడు. కాగా, ఈ కేసును న‌మోదుచేసుకున్న పోలీసులు యాసిడ్ దాడి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉంటుందా అని ఆరాతీస్తున్నారు.