Begin typing your search above and press return to search.

టాప్ సీక్రెట్ : ఇసుక మాఫియాను ఎంకరేజ్ చేస్తున్న ఎంపీ!

By:  Tupaki Desk   |   19 July 2019 11:30 AM GMT
టాప్ సీక్రెట్ : ఇసుక మాఫియాను ఎంకరేజ్ చేస్తున్న ఎంపీ!
X
బడుగు బలహీన వర్గం వాడినంటూ చెప్పుకునే ఒక ఎంపీ ఇసుక దందాకు వత్తాసు పలుకుతున్నట్టుగా తెలుస్తోంది. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ఆ ఎంపీ ఇసుక మాఫియాకు మద్దతుగా నిలుస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. గెలిచిన తక్కువ రోజుల్లోనే ఆయన ఇసుక మాఫియాతో రాసుకుపూసుకుంటున్నాడట.

ఇసుక ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను అరికట్టడానికి జగన్ మోహన్ రెడ్డి కంకణబద్ధులై ఉన్నారు. త్వరలోనూ ఇసుక విషయంలో నూతన విధానాలను అమలు చేయనున్నారు.

ఆగస్టు నుంచినే కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఆ పనుల్లో ఉండగా.. ఇలాంటి వాళ్లు మాత్రం పాత దందాలో భాగస్వామ్యులు అవుతుండటం గమనార్హం.

గత ప్రభుత్వ హయాంలో ఇసుకను ఒక దోపిడీ మార్గంగా మార్చుకున్నారు. ఐదేళ్లలో మొత్తం ఇసుకను గుల్ల చేశారు. ఇసుక మాఫియాతో నాటి నేతలు - మంత్రులు భాగస్వామ్యులై దోచుకున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఆ పరిస్థితులో మార్పు కోసం జగన్ ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే జగన్ స్వయంగా దగ్గరుండి గెలిపించుకున్న ఒక ఎంపీ ఇలాంటి పని చేస్తూ ఉండటం గమనార్హం. అతడి ఆర్థిక శక్తి కూడా ఏమీ లేకపోయినా.. మొత్తం జగన్ దగ్గరుండి చూసుకున్నారు. అయితే ఎంపీగా గెలిచాకా అతడిపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి!