Begin typing your search above and press return to search.

‘ఆనం’ది నోరా తాటి మట్టా..?

By:  Tupaki Desk   |   21 Jan 2017 9:57 AM GMT
‘ఆనం’ది నోరా తాటి మట్టా..?
X
ఎంతటివారైనా పరువు నష్టం కేసులంటే భయపడతారు. ఎందుకొచ్చిన రచ్చ అనుకుంటూ సైలెంటుగా ఉంటారు. కానీ... కొందరు మాత్రం కుక్క తోక వంకర అన్నట్లుగా తమ నోటికి పని చెబుతుంటారు. అలాంటి కోవకే వస్తారు ఆనం వివేకానంద రెడ్డి. గతంలో ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిందనందుకు గాను మూడు రోజుల క్రితమే కోర్టు నుంచి పరువు నష్టం నోటీసులు కూడా అందుకున్న ఆయన తన తీరును ఏమాత్రం మార్చుకోవడం లేదు.

ఇప్పటివరకు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా ఆ పార్టీ అదినేత జగన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఆయన ఒక అపశకునపు పక్షిగా అభివర్ణించారు. రెండేళ్లలో సీఎం అవుతా అంటూ కాకిలా జగన్ రాష్ట్రమంతా తిరుగుతూ అరుస్తున్నారని ఆనం విమర్శించారు. ఆనం వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

జగన్‌ కాకి అరుపులు చూసి జనం ఓటేయరని ఆనం అన్నారు. న్యూఢిల్లీని తలదన్నేలా మరో ఏడాదిలో అమరావతిని చంద్రబాబు నిర్హించబోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రెండేళ్ల తర్వాత రాష్ట్రపతి విడిది కేంద్రంగా అమరావతి ఉంటుందన్నారు. చంద్రబాబు రాజధాని యజ్ఞం చేస్తుంటే జగన్‌ మాత్రం రాక్షసుడిలా నెత్తురు చల్లుతున్నారని ఆనం విమర్శించారు.

గుడ్లగూబ జగన్‌ ను వెంటనే అరెస్ట్ చేసి రాష్ట్రంలో పర్యటన చేయకుండా అడ్డుకోవాలని చంద్రబాబును కోరారు. మామూలుగా నోటి దురుసుతనానికి పేరుపడ్డ ఆనం వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కానీ... తాజాగా ఆయన జగన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసేసరికి ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/