Begin typing your search above and press return to search.

వివేక హత్యోదంతం.. సిట్ విచారణలో కొత్త కోణం!

By:  Tupaki Desk   |   22 March 2019 2:50 PM GMT
వివేక హత్యోదంతం.. సిట్ విచారణలో కొత్త కోణం!
X
దారుణ హత్యకు గురి అయిన వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం తన విచారణను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకూ చాలా మందిని విచారించారు. ప్రత్యేకించి ఈ కేసులో వైఎస్ కుటుంబీకులను విచారించడం విశేషంగా మారింది. వైఎస్ కుటుంబీకుల్లో ప్రముఖుడు అయిన వివేకానందరెడ్డి హత్యకు గురి అయితే వైఎస్ కుటుంబీకులనే విచారించారు. వారిపై అనుమానాలు రేగాయి, విచారించారు అనుకుందాం. అలాగే సమాచారం కోసం కూడా వారిని విచారించి ఉండవచ్చు. అనుమానాలు ఎవరి మీద.. అనే కోణంలో కూడా వైఎస్ కుటుంబీకులను సిట్ విచారించి ఉండవచ్చు.

ఆ సంగతి అలా ఉంటే..ఈ కేసులో విచారణ విషయంలో మరో కోణం కూడా కనిపిస్తూ ఉంది. అదేమిటంటే.. ఈ వ్యవహారంలో కొందరిని విచారించడం లేదనే ఆరోపణ వినిపిస్తూ ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కాగానే.. కొన్ని పేర్లు తెర మీదకు వచ్చాయి. వారే ఈ హత్యను చేయించి ఉండవచ్చనే టాక్ వినిపించింది. ఆ పేర్లు ఏవో ఇప్పుడు ప్రత్యేకంగా మెన్షన్ చేయనక్కర్లేదు.

వివేకానందరెడ్డి హత్యలో రాజకీయ కోణం కూడా ఉండి ఉంటుందని, వివేకానందరెడ్డి తమకు రాజకీయంగా అడ్డుగా భావించిన ప్రత్యర్థులు ఈ హత్యను చేయించి ఉండవచ్చని, వివేక ఆస్తుల వ్యవహారాలను అడ్డం పెట్టుకుని.. కొంతమంది చేత ఈ పని చేయించి ఉండవచ్చని.. తమ పేరు వినిపించకుండా.. వేరే వ్యవహారాలను అడ్డం పెట్టుకుని, సదరు వ్యక్తులను ఉపయోగించుకుని, కిరాయి వ్యక్తులతో ఈ హత్య చేయించి ఉండవచ్చనే టాక్ వినిపిస్తూ ఉంది.

అయితే డైరెక్టుగా వారి జోక్యం లేకుండా.. చేసే వాళ్లతో ఈ పని చేయించి, తాము రాజకీయంగా అండగా ఉంటామని.. అధికారాన్ని చేతిలో పెట్టుకున్న కొందరు.. ఈ వ్యవహారాన్ని నడిపించి ఉండవచ్చనే చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో… అలా కొందరి మీద అనుమానాలు రేగాయి.

అలా కొందరి పేర్లు జనాల్లో నానాయి కూడా. అయితే సదరు వ్యక్తులను మాత్రం ఇప్పటి వరకూ సిట్ విచారణకు పిలవలేదు! వారిని పిలిచి.. వారిపై వస్తున్న ఆరోపణల గురించి వాకబు చేయలేదు. అసలు వారి ఊసే ఎత్తలేదు సిట్. సదరు నేతలే తమకు ఈ కేసుతో సంబంధం లేదని స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఈ కేసులో ప్రమేయం ఉందని తేలితే తమకు ఏ శిక్ష అయినా విధించుకోవచ్చని వారు సవాళ్లు విసిరారు. అయితే.. వారిని మాత్రం సిట్ తమ విచారణకు పిలవలేదు!

ఈ పరిణామంపై ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. వివేకానందరెడ్డి హత్య జరిగిందంటే.. వాళ్లింట్లో వాళ్లను విచారించారు సరే, వివేకపై రాజకీయ కక్షను కలిగి ఉన్న వాళ్లను ఎందుకు విచారించలేదు? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకడం లేదు!

ర‌ని ధ్వజ‌మెత్తారు. చంద్రబాబు అక్రమాల గురించి సోమ‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఈసీ ఉన్నతాధికారుల‌కు మరోసారి వివ‌రిస్తామ‌ని వెల్లడించారు.