Begin typing your search above and press return to search.

న్యూడ్ ఫొటోల‌తో ఆ యువ‌తి ల‌వ‌ర్‌కు చుక్క‌లు!

By:  Tupaki Desk   |   21 Jan 2017 8:45 AM GMT
న్యూడ్ ఫొటోల‌తో ఆ యువ‌తి ల‌వ‌ర్‌కు చుక్క‌లు!
X
కంటికి కాస్త ఇంపుగా క‌నిపిస్తే చాలు. ప్రేమ పేరిట ముగ్గులోకి దింపేస్తారు. ఆ పై స‌న్నిహితంగా గ‌డిపేస్తారు. ఆ స‌న్నివేశాల‌ను చాటుగా ఫొటోలు - వీడియోలుగా మ‌లిచేస్తారు. ఆపై వారిలోని అస‌లు రూపాన్ని బ‌య‌ట‌కు తీస్తారు. న్యూడ్ సీన్ల చిత్రాల‌ను చూపి వ‌రుస వేధింపుల‌తో పాటు పెద్ద మొత్తంలో డ‌బ్బుల వ‌సూళ్ల‌కు కూడా తెర తీస్తారు. నిన్న‌టిదాకా ఇదంతా... మ‌గాళ్లు చేసే తంతు. అయితే మ‌గాళ్ల‌కు తామేమీ త‌క్కువ కాద‌న్న రీతిలో దాదాపు అన్ని రంగాల్లో మహిళ‌లు కూడా స‌త్తా చాటుతున్నారు. చివ‌ర‌కు మ‌నం పైన చెప్పుకున్న మృగాళ్ల త‌ర‌హా వేధింపుల్లోనూ తామేమీ తీసిపోలేద‌ని చెప్పేసింది ఓ క‌న్నడ యువ‌తి. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్ ఫేస్ బుక్ ద్వారా త‌న‌కు ప‌రిచ‌య‌మైన ఓ సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌ ను ముగ్గులోకి దించిన ఈ బెంగ‌ళూరు యువ‌తి... ఆ ఇంజినీర్ నుంచి ఇప్ప‌టికే రూ.5 ల‌క్ష‌ల మేర వ‌సూలు చేసింద‌ట‌. ఇక అప్ప‌టికీ త‌న ధ‌న దాహం తీర‌ని ఆ యువ‌తి... ఈ సారి ఏకంగా రూ.కోటికి టెండ‌రేసింది. అయితే ఈ వ్య‌వ‌హారం బెడిసికొట్ట‌డంతో ఏ పోలీసుల‌నైతే ఆశ్ర‌యించిందో... అదే పోలీసుల‌తో త‌న‌కు ముప్పు పొంచి ఉంద‌ని గ్ర‌హించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

ఈ ఆశ్చ‌ర్య ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... త‌మిళ‌నాడులోని నామ‌క్క‌ల్ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ బెంగ‌ళూరు కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఓ ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ గా ప‌నిచేస్తున్నాడు. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరుకు చెందిన అర్చ‌న అనే యువ‌తి అత‌డికి ఫేస్ బుక్ ద్వారా ప‌రిచ‌యం అయ్యింద‌ట‌. ఈ ప‌రిచయం కాస్తా ప్రేమ‌గా మార‌డంతో... ప్రేమ్ కుమార్‌ - అర్చ‌న‌లు ఉల్లాసంగా, ఉత్సాహంగా గ‌డిపారు. ఆ సంద‌ర్భంగా ప్రేయ‌సి కోరిక మేర‌కు... ఆమె అస‌లు రంగును గుర్తించ‌కుండానే ప్రేమ్ కుమార్ న్యూడ్ గా ఆమెకు ఫోజులిచ్చాడ‌ట‌. స‌ద‌రు ఫొటోల‌ను భ‌ద్రంగా దాచుకున్న అర్చ‌న... ఆ త‌ర్వాత అత‌డికి త‌న నిజ స్వ‌రూపాన్ని చూపింది.

ల‌క్ష రూపాయ‌లు ఇస్తే స‌రి... లేదంటే న్యూడ్ గా తీసిన అత‌డి ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్టేస్తాన‌ని భ‌య‌పెట్టింది. దీంతో జ‌డిసిపోయిన ప్రేమ్‌కుమార్ ల‌క్ష రూపాయ‌లు స‌మ‌ర్పించుకుని బ‌తుకు జీవుడా అంటూ బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే ల‌క్ష రూపాయ‌ల‌తో అర్చ‌న దాహం తీర‌లేదు. ఏకంగా ప్రేమ్ కుమార్ స్వ‌స్థ‌లం రాశిపురం వెళ్లి... అక్క‌డి పోలీస్ స్టేష‌న్‌లో అత‌డిపై ఫిర్యాదు చేసింది. త‌న‌పై ప్రేమ్ కుమార్ అత్యాచారం చేసింద‌ని క‌న్నీళ్లు పెట్ట‌డంతో... పొరుగు రాష్ట్రం మ‌హిళ చేతిలో త‌మ ప్రాంతం అబ్బాయి బ‌లి కాకుండా ఉండేందుకు రాజీ మార్గం కుదిర్చిన రాశిపురం పోలీసులు అత‌డితో ఆమెకు మ‌రో రూ.4 ల‌క్ష‌లు ఇప్పించారు. ఆ డ‌బ్బు చేతికందిన కొన్ని రోజుల‌కే మ‌రోమారు రంగంలోకి దిగిన అర్చ‌న‌... ఈ సారి కోటి రూపాయ‌ల‌కు టెండ‌రేసింది. ఇలా ఇచ్చుకుంటూ పోతే.. ఈ త‌ర‌హా వేధింపుల‌కు హ‌ద్దు ఉండ‌ద‌ని గ్ర‌హించిన ప్రేమ్ కుమార్ రాశిపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అర్చ‌న అస‌లు మ‌న‌స్త‌త్వాన్ని అర్థం చేసుకున్న రాశిపురం పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేయ‌డంతో పాటు ఆమె కోసం గాలింపు మొద‌లెట్టార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/