Begin typing your search above and press return to search.

వాడు మ‌నిషి కాదు..వాడి దారుణం తెలిస్తే వ‌ణుకే!

By:  Tupaki Desk   |   23 March 2019 4:46 AM GMT
వాడు మ‌నిషి కాదు..వాడి దారుణం తెలిస్తే వ‌ణుకే!
X
ఆరేళ్ల చిన్న పాప‌. ఆ వ‌య‌సులో ఏం తెలుస్తుంది? ప‌లుక‌రిస్తే ప‌లుకుతారు. న‌వ్విస్తే న‌వ్వుతారంతే. మ‌నిషి మాటున ఉండే పిశాచాల గురించి క‌నీస అవ‌గాహ‌న ఉండ‌ని వ‌య‌సు అది. అలాంటి చిన్నారిని ఒక దుర్మార్గుడు ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రించాడో తెలిస్తే వ‌ణుకు పుట్ట‌ట‌మే కాదు.. అలాంటోడిని ఏం చేసినా త‌క్కువే అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇదంతా ఎక్క‌డో కాదు.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో చోటు చేసుకుంది.

హోలీ సంబ‌రాల్లో మునిగి తేలుతున్న ఆరేళ్ల చిన్నారిని మాయ‌మాట‌లు చెప్పి.. మాట‌ల్లో చెప్ప‌లేనంత దారుణంగా.. క‌ర్క‌శంగా అత్యాచారానికి పాల్ప‌డ‌ట‌మే కాదు.. అమానుషంగా చంపేసిన తీరు తెలిస్తే నోట మాట రాదంతే. ఈ ఉదంతంలో అంద‌రూ గ‌మ‌నించాల్సిన రెండు అంశాలు ఉన్నాయి. అందులో ఒక‌టి ఎవ‌రిని న‌మ్మ‌టానికి వీల్లేదు.. ఎవ‌రికి వారు వారి వారి పిల్ల‌ల్ని కంటికి రెప్ప‌లా అనుక్షణం క‌నిపెట్టుకు చూసుకోవాల‌న్న‌ది. రెండోది.. మ‌నిషిలో అంత‌కంత‌కూ పెరుగుతున్న క‌ర్క‌శ‌త్వం మ‌రీ ఇంతగానా? అన్న భావ‌న‌.

సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఉదంతం వివ‌రాల్లోకి వెళితే.. హైద‌రాబాద్‌ లోని అల్వాల్ తుర్క‌ప‌ల్లి రైల్వేగేటు స‌మీపంలో చోటు చేసుకున్న దారుణ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. ఈ ప్రాంతంలో నివ‌సించే కూలీ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. ఉద‌యాన్నే ప‌నికి వెళ్ల‌టం సాయంత్రానికి రావ‌టం చేస్తుంటారు. హోలీ వేళ అలా ప‌నికి వెళ్లి వ‌చ్చిన వారికి వారి ఆరేళ్ల పాప క‌నిపించ‌లేదు. ఎంత వెతికినా ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు. దీంతో పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు.

వెంట‌నే స్పందించిన పోలీసులు స్థానిక యువ‌కుల‌తో క‌లిసి జ‌ట్లుగా విడిపోయి వెత‌క‌టం మొద‌లెట్టారు. రైల్వే ట్రాక్ స‌మీపంలోని ముళ్ల పొద‌ల్లో అత్యంత ద‌య‌నీయ‌మైన ప‌రిస్థితుల్లో చిన్నారి మృత‌దేహం క‌నిపించింది. విచార‌ణ జ‌రిపిన పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలిసాయి. హోలీ సంద‌ర్భంగా కొంద‌రు యువ‌కులు ఆ ప్రాంతానికి వ‌చ్చారు. హోలీ ఆడారు. ఆ సంద‌ర్భంగా బాలిక సోద‌రుడికి రంగులు కొనిచ్చారు. కాసేప‌టికి బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి.. పొద‌ల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పెద్ద ఎత్తున ఏడుస్తుంటే.. త‌న ద‌గ్గ‌ర ఉంటే ప‌దునైన ఆయుధంతో చంపేశాడు.

ఫూటుగా తాగేసి.. మ‌త్తు త‌ల‌కెక్కన ఆ యువ‌కుడు బాలిక‌ను తీసుకెళ్లి అత్యాచారం చేసిన‌ట్లుగా గుర్తించారు. ఇక‌.. బాలిక మృత‌దేహానికి శ‌వ‌ప‌రీక్ష‌లు జ‌రిపిన వైద్యులు.. ఆ పాపకు ఎదురైన దారుణంపై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ర‌క్త‌మోడుతున్న‌ప్ప‌టికి క‌నిక‌రించ‌క అత్యాచారం చేసి వికృతానందానికి గురి కావ‌టం ఒక ఎత్తు అయితే..చంపేసిన త‌ర్వాత మ‌రోసారి అత్యాచారానికి పాల్ప‌డిన వైనాన్ని చూస్తే.. మ‌నిషి రూపంలో ఉన్న పిశాచిగా నిందితుడు అనిపించ‌టం ఖాయం.

త‌మ వృత్తి జీవితంలో ఇంత దారుణాన్ని తాము చూడ‌లేద‌ని చెబుతున్నారు. నేరానికి పాల్ప‌డిన‌యువ‌కుడు బిహార్ నుంచి రెండు నెల‌ల క్రిత‌మే న‌గ‌రానికి వ‌చ్చిన‌ట్లుగా గుర్తించారు. అత‌డి స్నేహితుల వ‌ద్ద‌కు వ‌చ్చిన క్ర‌మంలో ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసుల‌కు.. తాను చేసిన దుర్మార్గాన్ని ఒప్పుకున్నాడు. ఇలాంటి పిశాచిని ఏం చేసినా త‌క్కువేన‌ని చెప్పాలి.