Begin typing your search above and press return to search.

ఎవరికీ అందనంత ఎత్తున చంద్రబాబు

By:  Tupaki Desk   |   1 Dec 2015 5:55 AM GMT
ఎవరికీ అందనంత ఎత్తున చంద్రబాబు
X
నవ్యాంధ్రలో నిర్మించబోయే సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేషీ ఎక్కడుంటుందో తెలుసా..? ఎవరికీ అందనంత ఎత్తులో 40వ అంతస్తులో ఉంటుందట. అవును.. రాజధాని అమరావతిలో నిర్మించబోయే సెక్రటేరియట్ లో చంద్రబాబు పేషీని 40వ అంతస్థులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన బ్లూప్రింటును చంద్రబాబే స్వయంగా అధికారులకు అందజేశారు.

ఏపీ సచివాలయాన్ని రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. సచివాలయం 40 అంతస్థుల భారీ భవంతిగా ఉండాలని చంద్రబాబు ఇప్పటికే సూచించారు. ఇందులో ఆయా శాఖల మంత్రులు - ప్రిన్సిపల్ సెక్రటరీలు - కమిషనర్లు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ 40 అంతస్థుల భవనంలో ఒక్కో అంతస్థులో లక్ష చదరపు అడుగుల వైశాల్యం అందుబాటులో ఉంటుందట. ఏఏ ఫ్లోర్లలో ఏమేమి ఉండాలి... ఎవరెవరికి ఎక్కడెక్కడ చాంబర్లు ఉండాలన్న విషయమై చంద్రబాబు స్పష్టంగా ఆదేశాలిచ్చారు. కింది ఫ్లోరులో మంత్రులు ఉంటారు. అందరికంటే ఎత్తున 40వ అంతస్థులో చంద్రబాబు పేషీ ఉంటుంది. కాగా సచివాలయ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.