Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో కిన్లే వాటర్ బాటిల్ రూ.207
By: Tupaki Desk | 14 Jun 2019 10:43 AM GMTఒక వాటర్ బాటిల్ ధర ఎంత? అన్న ప్రశ్న వేసినంతనే రూ.20 అన్న మాట వస్తుంది. మామూలుగా కాదు.. మాల్.. మల్టీఫ్లెక్స లో ఎంత ఉంటుందంటే..? రూ.40.. రూ.50.. రూ.70 ఇలా రేట్లు చెబుతారు. మరి.. లీటర్ కిన్లే వాటర్ బాటిల్ అన్నంతనే రూ.20 అని చెప్పేస్తాం.
అయితే.. దోచుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక రెస్టారెంట్ వినియోగదారుల్ని ఎంతలా దోపిడీ చేస్తున్నారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. తాజాగా అందిన ఫిర్యాదుతో తూనికలు కొలతల శాఖ అధికారులు నెక్లెస్ రోడ్డులో ఉన్న బైద బే వాటర్ ఫ్రంట్ బార్ అండ్ రెస్టారెంట్ లో రూ.20 కిన్లే వాటర్ బాటిల్ ఏకంగా రూ.207 అమ్ముతున్న వైనాన్ని గుర్తించారు.
అంతేకాదు.. రూ.99 అమ్మాల్సిన రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ ను రూ.209 అమ్ముతున్న వైనాన్ని గుర్తించారు. అంతేకాదు.. ప్రతి పెగ్గుపై 11 శాతం మందును తక్కువగా సర్వ్ చేస్తూ మందుబాబుల్ని మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ప్రతి రూ.1336 బిల్లులో రూ.147 మోసానికి పాల్పడుతున్న వైనాన్ని గుర్తించారు. ఇంత దారుణంగా ధరలు వడ్డిస్తున్న వైనం తూనికలు కొలతల శాఖ అధికారులకే షాకింగ్ గా మారింది.
అయితే.. దోచుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక రెస్టారెంట్ వినియోగదారుల్ని ఎంతలా దోపిడీ చేస్తున్నారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. తాజాగా అందిన ఫిర్యాదుతో తూనికలు కొలతల శాఖ అధికారులు నెక్లెస్ రోడ్డులో ఉన్న బైద బే వాటర్ ఫ్రంట్ బార్ అండ్ రెస్టారెంట్ లో రూ.20 కిన్లే వాటర్ బాటిల్ ఏకంగా రూ.207 అమ్ముతున్న వైనాన్ని గుర్తించారు.
అంతేకాదు.. రూ.99 అమ్మాల్సిన రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ ను రూ.209 అమ్ముతున్న వైనాన్ని గుర్తించారు. అంతేకాదు.. ప్రతి పెగ్గుపై 11 శాతం మందును తక్కువగా సర్వ్ చేస్తూ మందుబాబుల్ని మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ప్రతి రూ.1336 బిల్లులో రూ.147 మోసానికి పాల్పడుతున్న వైనాన్ని గుర్తించారు. ఇంత దారుణంగా ధరలు వడ్డిస్తున్న వైనం తూనికలు కొలతల శాఖ అధికారులకే షాకింగ్ గా మారింది.