Begin typing your search above and press return to search.

సివిల్స్‌లో తెలుగోళ్లకు 14వ ర్యాంకు..!

By:  Tupaki Desk   |   4 July 2015 10:03 AM GMT
సివిల్స్‌లో తెలుగోళ్లకు 14వ ర్యాంకు..!
X
కొద్ది సంవత్సరాల క్రితం ఉమ్మడి తెలుగు రాష్ట్రం దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించేందుకు. పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాల్లో తెలుగు విద్యార్థులు.. అభ్యర్థులు దూసుకుపోవటం.. అత్యున్నత స్థానాల్లో నిలవటం వార్తాంశంగా ఉండేది.

సివిల్స్‌ లాంటి పరీక్షల్లో సైతం మొదటి పది ర్యాంకుల్లో కొన్నింటిని కొల్లగొట్టిన ట్రాక్‌ రికార్డు తెలుగువారి సొంతం. తాజాగా..సివిల్స్‌కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టాప్‌ ఫైవ్‌లో నాలుగు అత్యుత్తమ స్థానాల్ని అమ్మాయిలే సాధించటం.

ఫస్ట్‌ర్యాంకును ఇరా సింఘాల్‌ కైవశం చేసుకోగా.. రెండో ర్యాంకును రేణూరాజ్‌.. మూడో ర్యాంక్‌ నిధి గుప్తా.. నాలుగో ర్యాంకు వందనారావులకు దక్కాయి. ఇక.. ఐదో ర్యాంకు సుహర్ష భగన్‌కు దక్కింది.

ఇక.. తెలుగువారికి సంబంధించి.. ఈసారి అత్యుత్తమ ర్యాంకు సాకేత్‌ రాజా చేజిక్కించుకున్నారు. అతనికి 14వ ర్యాంకు లభించింది. ఇక.. లక్ష్మీకాంతరెడ్డికి 21వ ర్యాంకు.. సుంకర రాజ్‌గోపాల్‌కు 49 ర్యాంకు.. క్రాంతికుమార్‌కు 50వ ర్యాంకు లభించాయి.

తెలుగువారికి సంబంధించి మరికొన్ని ర్యాంకుల విషయానికి వస్తే.. (అందుబాటులో సమాచారం ప్రకారం)

I ఎంవీఆర్‌ తేజ (66వ ర్యాంకు)

I వేదితా రెడ్డి (71వ ర్యాంకు)

I లక్ష్మీ భవ్య (88వ ర్యాంకు)