Begin typing your search above and press return to search.

పూజాహెగ్డే కొత్త ముచ్చట

By:  Tupaki Desk   |   3 July 2015 4:24 AM GMT
పూజాహెగ్డే కొత్త ముచ్చట
X
హీరోయిన్లకు ఆదాయ మార్గం సినిమా ఒక్కటే కాదు. యాడ్లనీ, షాప్‌ ఓపెనింగ్సనీ ఇలా చాలా దారులే ఉన్నాయి. వాటితోపాటు ఇటీవల స్టేజ్‌ షోలు కూడా వాళ్లకి చేతినిండా ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. బాలీవుడ్‌లో కత్రినాకైఫ్‌, దీపికా పదుకొణేలాంటి స్టార్‌ హీరోయిన్లు సైతం స్టేజీ షోలలో డ్యాన్సులేసి డబ్బు సంపాదిస్తున్నారు. వీళ్లు గంటకు కోట్ల లెక్కన తీసుకొంటున్నారు. ఆ రేంజ్‌లో స్టేజీ షోలు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందుకే ఎంత పెద్ద హీరోయిన్‌ అయినా స్టేజీ అనేసరికి ఎగిరి గంతేస్తుంటుంది. తాజాగా మెగా హీరోయిన్‌, ముకుందలో వరుణ్‌తేజ్‌తో ఆడిపాడిన మన పూజా హెగ్డే కూడా స్టేజీ ఎక్కాలని నిర్ణయించుకొంది. దుబాయిలో జరగనున్న నాలుగో సైమాలో తొలి స్టేజీ షో చేసేందుకు ఓకే చెప్పేసింది పూజా హెగ్డే. ఆ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పుకొచ్చింది.

''నేనెప్పుడూ స్టేజ్‌ షోలు చేయలేదు. తొలిసారి సైమాలోనే చేస్తున్నా. తెలుగులో నా హిట్టు సాంగ్‌ గోపికమ్మా... అనే పాటకి డ్యాన్స్‌ చేయాలనుకొంటున్నా. తొలి షో కాబట్టి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది'' అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. అమ్మడు ఇప్పుడు బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌తో కలిసి 'మొహంజదారో' అనే చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిపోయింది కాబట్టి అక్కడి వాతావరణం బాగా ఒంటబట్టించుకుంటున్నట్టు అనిపిస్తోంది.