Begin typing your search above and press return to search.

మోడీ ఆపేశారంట.. కేసీఆర్‌ కొనసాగిస్తున్నారంట

By:  Tupaki Desk   |   26 May 2015 5:56 AM GMT
మోడీ ఆపేశారంట.. కేసీఆర్‌ కొనసాగిస్తున్నారంట
X
కాస్తంత సిత్రంగా మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి అలవాటే. ఆ మధ్య ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణరాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయను.. కమిషన్‌ కాకతీయగా అభివర్ణించి నాలుక కర్చుకోవటం.. అధికరపక్షాన్ని తీవ్ర అవస్థల పాలు చేయటం తెలిసిందే.

విపక్షాలు చేసే కమీషన్‌ కాకతీయ వ్యాఖ్యను యథాతధంగా వాడేసిన నాయిని మాటపై చాలానే జోకులు పేలాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో కామెడీ కలిగించే నాయిని మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ స్టార్ట్‌ చేసిన స్వచ్ఛభారత్‌ మధ్యలో ఆగిపోయిందని చెప్పిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్టార్ట్‌ చేసిన స్వచ్ఛ హైదరాబాద్‌ మాత్రం సాఫీగా సాగుతుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం.. స్వచ్ఛభారత్‌లో భాగమేనన్న విషయం నాయిని గుర్తించకపోవటం ఏమిటో..? మొత్తానికిప్రధాని మోడీ కంటే తమ బాసు చాలా గొప్ప అని చెప్పటానికి నాయిని పడుతున్న ప్రయాస మరిన్ని జోకులకు కారణమవుతోంది.మోడీ స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో తాము స్వచ్ఛ హైదరాబాద్‌ను నిర్వహిస్తున్నట్లు ఓ పక్క తెలంగాణ ముఖ్యమంత్రి సహా.. పలువురు నేతలు చెబుతుంటే.. అందుకు భిన్నంగా నాయిని మాట్లాడటం కామెడీ కాకుండా మరేంటి..?