Begin typing your search above and press return to search.

టచ్‌ చేశారు సార్‌.. రాజు గారు

By:  Tupaki Desk   |   26 May 2015 1:30 PM GMT
టచ్‌ చేశారు సార్‌.. రాజు గారు
X
స్టార్‌ కమెడియన్‌ ఎమ్మెస్‌ నారాయణ చనిపోతే.. ఆయన తమ సినిమాల్లో ఎంత కీలకమైన స్టార్‌ రోల్‌ చేసినప్పటికీ ఆయనకు సినిమాను అంకితమివ్వడం కాదు కదా.. కనీసం ఆయనకు నివాళులు అనే కార్డు కూడా వేయలేదు. బడ్డా స్టార్ల సినిమాల్లోనే ఈ మ్యాటర్‌ చోటుచేసుకుంది. అయితే వీళ్లందరికంటే డిఫరెంట్‌ మన నిర్మాత దిల్‌ రాజు. ఆయన తన సినిమాలకు సంబంధం లేనివారికి కూడా సినిమాను అంకితమిస్తున్నారు. అది ఒక హానెస్ట్‌ కమిట్‌మెంట్‌ అంటే.

తెలుగు సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిన స్థాయి మూవీ మొఘల్‌ రామానాయుడు గారిదైతే.. తెలుగు సినిమా సౌండ్‌ను కొత్త పుంతలు తొక్కించింది మిక్సింగ్‌ ఇంజనీర్‌ డిటిఎస్‌ మధుసూదన్‌ రెడ్డి. వీళ్లిద్దరికీ తమ సినిమాను అంకితం ఇస్తున్నట్లు తెలిపారు దిల్‌ రాజు. ప్రముఖ అవార్డ్‌ విన్నింగ్‌ డైరక్టర్‌ సాయికిరణ్‌ అడివి డైరక్షన్‌లో ''కేరింత'' సినిమాను రూపొందించారు రాజు. కాస్త లేటైనా కూడా ఆకట్టుకుంటాం అంటున్నారు. చూడ్డానికి రొటీన్‌ లవ్‌, ఫ్రెండ్‌షిప్‌ కాన్సెప్టులా అనిపించినా కూడా సన్నివేశాలు బాగుంటాయ్‌ అని చెబుతూ, సినిమాను చూసిన అల్లు అరవింద్‌ తెగ లైక్‌ చేశారని సర్టిఫై ఇచ్చారు. ఏదేమైనా సినిమాను అంకితమిచ్చి టచ్‌ చేశారు సార్‌!!