Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి కొడుకు వ్యాపారంలోకి!

By:  Tupaki Desk   |   30 May 2016 7:43 AM GMT
రాజ‌మౌళి కొడుకు వ్యాపారంలోకి!
X
ఈగ‌... బాహుబ‌లి చిత్రాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆ చిత్రాల వెన‌క రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ క‌ష్టం కూడా ఉంది. స‌హాయ ద‌ర్శ‌కుడి ప‌ని మొద‌లుకొని... లైట్‌ బాయ్ ప‌ని వ‌ర‌కు కార్తికేయ‌ని ఎలా కావ‌లిస్తే అలా వాడుకొన్నాడు రాజమౌళి. తండ్రితో పాటే క‌లిసి ప‌నిచేస్తున్నాడు కాబ‌ట్టి కార్తికేయ కూడా భ‌విష్య‌త్తులో ద‌ర్శ‌కుడు కావొచ్చ‌నే ప్ర‌చారం టాలీవుడ్‌ లో జ‌రిగింది. ఒక ప్ర‌ముఖ క‌థానాయ‌కుడితో సినిమా తీయ‌బోతున్నాడ‌ని కూడా ఇటీవ‌ల చెప్పుకొన్నారు. అయితే ఆ వార్త‌ల్ని స్వ‌యంగా తోసిపుచ్చాడు కార్తికేయ‌.

ఆయ‌న ద‌ర్శ‌కుడు అవుతాడో కాదో తెలియ‌దు కానీ... ప్ర‌స్తుతానికి మాత్రం వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఫ్రెండ్‌ తో క‌లిసి ది స‌ర్క్యూట్ పేరుతో ఓ హోటల్‌ ని తెరిచాడు. హైద‌రాబాద్‌ లోని కొండాపూర్‌ లో ఈ కొత్త వెంచ‌ర్‌ ని ప్రారంభించాడు. ఆ విష‌యాన్ని బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ప్రాన్స్ ప‌లావు - ర‌వ్వ‌దోశ ఇక్క‌డ ట్రై చేయండ‌ని - అదిరిపోతుంద‌ని ఆయ‌న ట్వీట్ చేశాడు. రాజ‌మౌళి త‌న‌యుడు కొత్త వ్యాపారం మొద‌లుపెట్టాడ‌ని తెలిసిన‌ప్ప‌ట్నుంచి ఇండ‌స్ట్రీలోని ప్రముఖులంతా అటువైపు ఓ లుక్కేద్దాం అని డిసైడ‌వుతున్నారు. ట్విట్ట‌ర్‌ లో కార్తికేయ‌కి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.