Begin typing your search above and press return to search.

బాక్సాఫీసుపై త‌మిళ పులుల దాడి!

By:  Tupaki Desk   |   4 Aug 2015 5:00 AM GMT
బాక్సాఫీసుపై త‌మిళ పులుల దాడి!
X
ఏక‌కాలంలో రెండు త‌మిళ్ పులులు తెలుగు బాక్సాఫీసుపై దాడి చేయ‌బోతున్నాయి. ఒకటి విజ‌య్ `పులి`, మ‌రొక‌టి విశాల్ `పాయుమ్ పులి`. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ స్థాయి ఇమేజ్‌ ని సొంతం చేసుకొన్న విజ‌య్ ఇప్పుడు `బాహుబ‌లి` త‌ర‌హాలో ఓ ఫాంట‌సీ చిత్రం చేస్తున్నాడు. అదే... `పులి`. వంద కోట్ల వ్య‌యంతో ఈ సినిమాని తెర‌కెక్కించార‌ట‌. బాహుబ‌లికి ఏమాత్రం త‌గ్గ‌కుండా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఉంటాయ‌ట‌. ఇప్ప‌టికే `తుపాకి`తో తెలుగులో మంచి ఫామ్‌ ని అందుకొన్న విజ‌య్ `పులి`తో ఇక్క‌డ మ‌రింత‌గా అద‌ర‌గొట్టాల‌ని ఆయ‌న డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అందుకే త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజు చిత్రాన్ని విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకొన్నాడు. మొన్న‌నే త‌మిళ్‌ లో ఆడియో ఫంక్ష‌న్‌జ‌రిగింది. తెలుగులో తుపాకి విడుద‌ల చేసిన శోభారాణియే `పులి`ని విడుద‌ల చేస్తోంది. తెలుగులో 1400 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తామ‌ని ఆమె చెన్నైలో జ‌రిగిన ఆడియో వేడుక‌లో చెప్పింది. అంటే `బాహుబ‌లి` రేంజ్‌ లో విజ‌య్ `పులి` విడుద‌ల‌వుతుంద‌న్న‌మాట‌. వినాయ‌క చ‌వితిని పురస్క‌రించుకొని సెప్టెంబ‌రు 17న సినిమాని విడుద‌ల చేసే అవ‌కాశాలున్న‌ట్టు స‌మాచారం.

తెలుగులో ఇప్ప‌టికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ని సంపాదించిన విశాల్ కూడా త‌న సినిమాని అదే స‌మ‌యంలో విడుద‌ల చేయాల‌నుకొంటున్నాడు. విశాల్ త‌మిళంలో `పాయుమ్ పులి` అనే చిత్రం చేస్తున్నాడు. అది తెలుగులోనూ ఇప్ప‌టికే బిజినెస్ పూర్తి చేసుకొంది. సెప్టెంబ‌రు 17నే సినిమాని విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో విశాల్‌, కాజ‌ల్ జంట‌గా న‌టించారు. విశాల్ ఓ క‌ర‌ప్టెడ్ పోలీసుగా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌లే చెన్నై లో పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఆ ట్రైల‌ర్ కూడా ఎక్స్‌ పెక్టేష‌న్స్ పెంచేలా ఉన్నాయి. రెండు పులులు ఒకేసారి తెలుగు బాక్సాఫీసుపై దాడి చేయ‌బోతున్నాయ‌న్న‌మాట‌. మ‌రి ఏ పులి ఏ స్థాయిలో ఆక‌ట్టుకుంటుందో చూడాలి.