Begin typing your search above and press return to search.

మ‌హానటి డిన్న‌ర్ డేట్ ఎవ‌రితో?

By:  Tupaki Desk   |   21 April 2019 4:20 AM GMT
మ‌హానటి డిన్న‌ర్ డేట్ ఎవ‌రితో?
X
కొన్ని స్నేహాలు అనుకోకుండా కుదురుతాయి. అలా కుదిరాక అనుబంధంగా మార‌తాయి. ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి స్నేహాలు ఎన్నో. మ‌న స్టార్లు బాలీవుడ్ స‌హా ఇత‌ర సినీప‌రిశ్ర‌మ‌ల్లో స్నేహానుబంధం కొన‌సాగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అలాంటి మ‌రో స్నేహం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇంత‌కీ ఎవ‌రి మ‌ధ్య ఈ కొత్త స్నేహం? అంటే.. మ‌హాన‌టి కీర్తి సురేష్‌.. ధ‌డ‌క్ ఫేం జాన్వీ క‌పూర్.

ఇద్ద‌రూ సినీనేప‌థ్యం ఉన్న న‌ట‌వార‌సురాళ్లు. సీనియ‌ర్ న‌టి మేన‌క కుమార్తె కీర్తి సురేష్. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్. ఆ ఇద్ద‌రూ క‌లిసి ముంబైలో డిన్న‌ర్ కి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఒక‌రితో ఒక‌రు ఎంతో ఆప్యాయంగా ఉన్న దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. అరే.. ఇలా బాలీవుడ్ లో అడుగుపెడుతోందో లేదో అలా మ‌హాన‌టి అంద‌రినీ త‌న‌దైన స్టైల్లో ఆక‌ట్టుకుంటోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన బోనీక‌పూర్ వార‌సురాలితో చెట్టాప‌ట్టాల్ అంటూ తిరిగేస్తోంది అంటూ సౌత్ లో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కీర్తి అభిమానుల్లో.. ప్ర‌స్తుతం ఇదో హాట్ టాపిక్.

ఇంత‌కీ ఈ బంధం ఎలా కుదిరింది? అంటే ప్ర‌స్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమాకి జాన్వీ డాడ్ బోనీ క‌పూర్ నిర్మాత‌. అజ‌య్ దేవ‌గ‌న్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. మ‌రోవైపు బోనీక‌పూర్ త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోనూ అజిత్ తో క‌లిసి పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక శ్రీ‌దేవి భ‌ర్త‌గా బోనీకి త‌మిళ ప‌రిశ్ర‌మ‌తో ద‌శాబ్ధాల పాటు అనుబంధం ఉంది. ప్ర‌స్తుతం కీర్తిని బాలీవుడ్ కి పరిచ‌యం చేస్తూ కోలీవుడ్ కి మ‌రింత‌గా చేరువైపోయారు. ఇక ఆయ‌న వార‌సురాలు జాన్వీతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న కీర్తితో స్నేహం కుదిరింది కాబ‌ట్టి.. బోనీ డాట‌ర్ కు సౌత్ ఎంట్రీ ప‌ని ఈజీ అయిన‌ట్టేన‌న్న ముచ్చ‌టా సాగుతోంది. బాల‌న‌టిగా కీర్తి సురేష్ చాలా సీనియ‌ర్. జాన్వీ వ‌న్ ఫిలిం కిడ్. అందుకే కీర్తి నుంచి విలువైన స‌ల‌హాలు జాన్వీ షైన్ అవ్వ‌డానికి ఉప‌క‌రిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే జాన్వీ అర్జున్ రెడ్డి ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించాల‌నుంద‌ని .. అత‌డి న‌ట‌న‌కు ఫిదా అయిపోయాన‌ని ప్ర‌క‌టించింది. అంటే తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చే ఆలోచ‌న‌లో ఉంది. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ హీరోగా అశ్వ‌నీదత్ `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్ ప్లాన్ లోనూ ఉన్నారు కాబ‌ట్టి ఇక్క‌డ మెగా ఆఫ‌ర్ ద‌క్కించుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. జాన్వీ ప్ర‌స్తుతం త‌క్త్ అనే భారీ హిస్టారిక‌ల్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.