Begin typing your search above and press return to search.

అనుమతిలేకుండా ఆపని చేస్తే.. కత్రినాకు కోపం!

By:  Tupaki Desk   |   30 July 2016 2:36 PM GMT
అనుమతిలేకుండా ఆపని చేస్తే.. కత్రినాకు కోపం!
X
ఎవరైనాసరే తనను వెంబడించి - అనుమతి లేకుండా తన ఫోటోలను తీస్తే తాటతీస్తాను - పోలీసులకు కంప్లైట్ చేస్తాను - కేసులు పెడతాను అని హెచ్చరిస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఎందుకోగానీ ముందునుంచీ ఫోటోగ్రాఫర్ల విషయంలో కత్రినా చిందులు తొక్కుతూనే ఉంటుంది! అసలు ఫోటోగ్రాఫర్లకూ కత్రినాకైఫ్ కు ఎందుకు పడదంటే... ఆమె అనుమతి లేకుండా ఎక్కడబడితే అక్కడ క్లిక్ క్లిక్ మనిపిస్తుంటారట. సెలబ్రెటీలు - పైగా బాలీవుడ్ సెలబ్రెటీలు అందునా హీరోయిన్లు... ఫోటొగ్రాఫర్ల పని అదేకదా అని అర్ధంచేసుకోవడం లేదట ఈ ముద్దుగుమ్మ!

తాజాగా కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టూడియో నుంచి బయటకు వస్తున్న కత్రిన.. కారు ఎక్కుతుండగా అక్కడే ఉన్న కొంతమంది ఫోటోగ్రాఫర్లు తమ కెమేరాలకు పనిచెప్పారట. దీంతో కోపంతో ఊగిపోయిన కత్రినా.. కారు దిగివచ్చి వారందరికీ ఫుల్ వార్నింగ్ ఇచ్చిందట. ఎవరైనా సరే తన అనుమతి లేకుండా ఫోటోలు తీస్తే కేసులు పెడతాను అని హెచ్చరించట!!

కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టూడియోలో.. వరల్డ్ టూర్ కోసం కత్రినా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తోంది. అయితే అప్పటికే ఆమెకు కాస్త అనారోగ్యంగా ఉండటంతో.. స్టూడియోకి వచ్చిన డాక్టర్లు.. ఆమెకు రెస్ట్ అవసరమని చెప్పారట. దీంతో రిహార్సల్స్ మధ్యలోని ఆపేసిన కత్రినా.. ఇంటికి బయలుదేరుతుండగా ఈ సంఘటన జరిగిందట. తర్వాత ఇది అనారోగ్యం వల్ల వచ్చిన అసహనమే తప్ప మరొకటి కాదని సన్నిహితులు ఫోటోగ్రాఫర్లకు నచ్చచెప్పారట. కాగా.. గతంలో రణ్ బీర్ తో బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కత్రినా.. కనిపించిన ప్రతీ ఫోటోగ్రాఫర్ పైనా చిందులు తొక్కుతూ ఇలానే బెదిరించేది! ఏది ఏమైనా.. కత్రినా ఇలా వార్నింగులు ఇవ్వడం ఏమీ బాగాలేదని ఫోటోజర్నలిస్టులు వాపోతున్నారట!