Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరితో నందమూరి హీరో రొమాన్సా??

By:  Tupaki Desk   |   19 April 2018 11:12 AM GMT
ఆ ఇద్దరితో నందమూరి హీరో రొమాన్సా??
X
సినిమా తరవాత మళ్లీ సినిమా చేయడానికి కాస్త టైం గ్యాప్ తీసుకునే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈమధ్య స్టయిల్ మార్చాడు. ఇప్పుడు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా చకచకా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎం.ఎల్.ఎ. (మంచి లక్షణాలున్న అబ్బాయి) ఈ మధ్యనే థియేటర్లకొచ్చింది. సినిమా ఫర్వాలేదని అనిపించుకున్నా కలెక్షన్లు మాత్రం డల్ గానే ఉన్నాయి.

కళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఎ. సినిమాను కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేశాడు. దీని తరవాత కూడా మళ్లీ కొత్త డైరెక్టర్ కే ఛాన్సిచ్చాడు. సినిమాటోగ్రాఫర్ గుహన్ డైరెక్షన్ లో తన తరవాత సినిమా చేయబోతున్నాడు. దీనికి నా నువ్వే అనే టైటిల్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. గుహన్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో కళ్యాణ్ రామ్ వెంటనే ఓకే చెప్పాడట.

సాధారణంగా కళ్యాణ్ రామ్ సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే ఉంటారు. కెరీర్ లో ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడింది తక్కువే. దీనికి భిన్నంగా ఈ కొత్త సినిమాలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఉండే కథ అని తెలుస్తోంది. ఈ పాత్రలను నివేదా థామస్.. అర్జున్ రెడ్డి ఫేం షాలినీ పాండే చేయబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఇంతవరకు గెటప్ లలో కొత్తదనం ట్రై చేసిన కళ్యాణ్ రామ్ హీరోయిన్ల విషయంలో ట్రై చేస్తున్నాడు. పటాస్ తరవాత మొహం చాటేసిన విజయం మళ్లీ పలకరిస్తుందేమో చూడాలి మరి.