Begin typing your search above and press return to search.

పీసీ పై కొనసాగుతున్న సోషల్‌ దాడి..!

By:  Tupaki Desk   |   13 Dec 2018 4:44 AM GMT
పీసీ పై కొనసాగుతున్న సోషల్‌ దాడి..!
X
బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఇటీవలే అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తంతుకు బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా హాజరు అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం వీరు హనీమూన్‌ మూడ్‌ లో ఉన్నారు. ఓమన్‌ లో ఈ జంట విహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రియాంక చోప్రా ప్రేమ, పెళ్లి ఎప్పటికప్పుడు మీడియాలో ఏదో ఒక వివాదాస్పద అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

నిక్‌ ను మోసం చేసి అతడి డబ్బు కోసం, అతడితో సెక్స్‌ కోసం ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంది అంటూ ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలో కథనం వచ్చిన విషయం తెల్సిందే. ఆ కథనం పెద్ద ఎత్తున దుమారం రేపడంతో సదరు మీడియా సంస్థ ఆ తర్వాత ఆ కథనం రాసిన జర్నలిస్ట్‌ లు క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి పీసీని టార్గెట్‌ చేసి దీపిక భరద్వాజ్‌ అనే మహిళ కామెంట్స్‌ చేసింది.

గతంలో పీసీ మహిళల సాధికారత కోసం పోరాటం చేస్తాను, మహిళలు అంటే కేవలం మగాళ్లకు భార్యలు మాత్రమే కాదు అంటూ డైలాగ్‌ లు చెప్పింది. ఇప్పుడు వాటి గురించి దీపిక భరద్వాజ్‌ ఇండైరెక్ట్‌ గా ట్విట్టర్‌ లో.. పిల్లలు కనడానికి మాత్రమే మాకు మగాళ్లు కావాలని కొందరు బాలీవుడ్‌ సెలబ్రెటీలు చెబుతూ వస్తారు. కాని వారికి నచ్చిన మగాడు దొరకగానే నుదుట సింధూరం పెట్టుకుని మరీ పెళ్లికి సిద్దం అవుతారు. నా భర్త దేవుడు, నా భర్త గ్రేట్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తారంది. మహిళ సాధికారత అంటూ చెప్పే వారు అంతా కూడా పెళ్లి చేసుకుని వారి పేరుకు భర్త పేరు తగిలించుకుంటారని కూడా దీపిక ట్వీట్‌ చేసింది.

పీసీ ఇటీవల తన పేరుకు చివర్లో జొనస్‌ ను యాడ్‌ చేసుకుంది. అందుకు దీపిక భరద్వాజ్‌ ఇలా ఆమెను టార్గెట్‌ చేసి ట్వీట్‌ చేసింది. దీపిక భరద్వాజ్‌ ట్వీట్‌ కు పీసీ తల్లి మధు చోప్రా స్పందించారు. సింధురం వల్ల స్త్రీ సాధికారతకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ విషయాన్ని ప్రియాంక నిరూపిస్తుంది చూస్తూనే ఉండండి అంటూ ట్వీట్‌ చేసింది.