Begin typing your search above and press return to search.

మరో పవర్ పాట

By:  Tupaki Desk   |   3 Aug 2015 11:48 AM GMT
మరో పవర్ పాట
X
సినిమా జయాపజయాలతో నిమిత్తం లేని అభిమానులు పవన్ కళ్యాణ్ సొంతం. పవన్ అభిమానుల్లో సాధారణ ప్రజలే కాదు. సెలబ్రిటీలు వున్నారు. నితిన్ లాంటి యువహీరోలు తమ సినిమాల్లో పవన్ నటించిన కొన్ని సన్నివేశాలను, పాటలను చూపిస్తూ వారి అభిమానం చాటుకుంటారు. ఈ విషయం అలా ఉంచితే తన పాటతోనే ఒంట్లో ఊపు తెప్పిస్తాడు పాప్ సింగర్ బాబా సెహగల్. పవన్ అభిమానులో ఇతనొకరు. ఆ అభిమానంతోనే 2012లో పవనిజం అంటూ పవర్ స్టార్ పై ఓ పాట స్వయంగా రాసి, పాడి, కంపోజ్ చేశాడు. రెండేళ్ళ తర్వాత మరోసారి అలాంటి పవర్ఫుల్ పాటని ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట.

రూపు తేరా మస్తానా అంటూ అన్నయ్య చిరంజీవి సినిమాలో టాలీవుడ్ కి పరిచయమయిన బాబా సెహగల్ పవన్ కళ్యాణ్ జల్సా పాటతో బాగా పాపులర్ అయ్యారు.ఎంతగా అంటే ఏ వేదిక ఎక్కినా ఈ సినిమా టైటిల్ సాంగ్ పాడాల్సిందే. పవన్ వ్యక్తిత్వాన్ని, అభిమానుల్ని చూసి ఫిదా అయిపోయిన బాబా పవనంటేనే పవరూ అంటే సాగే గీతాన్ని ఆయనకు అంకితమిచ్చారు. ఆ పాట పవన్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఇప్పుడు చెయ్యబోయే పాటని పవన్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2)న విడుదల చేస్తారట. అభిమానులూ గెట్ రెడీ ఫర్ వన్ మోర్ పవర్ఫుల్ సాంగ్.