Begin typing your search above and press return to search.

అమెరికాలో బాలయ్య ఆనందం డబుల్

By:  Tupaki Desk   |   11 Jun 2016 5:03 PM GMT
అమెరికాలో బాలయ్య ఆనందం డబుల్
X
అమెరికా టూర్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన లైఫ్ కి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగించే పలు ఈవెంట్స్ లో పాల్గొన్నారు. కొత్త సినిమా గౌతమిపుత్ర శాతకర్ణికి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఎమ్మేల్యే బాలకృష్ణగా ప్రభుత్వం తరఫున బయో ఏషియా సదస్సులో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈవెంట్స్ సంగతి సరేసరి. ఇప్పుడు ఓ ఫ్యామిలీ పర్సన్ గా కూడా పూర్తి సంతోషాన్ని బాలయ్య అందుకున్నారు.

బాలకృష్ణ రెండో కూతురు నందమూరి తేజస్విని.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాంతాక్లారా యూనివర్సిటీలో ఎంబీఏ విద్యను పూర్తి చేసింది. ఎంబీఏ పూర్తయిన సందర్భంగా జరిగే కాన్వొకేషన్ లో పట్టా అందుకునే సమయంలో.. అక్కడే ఉన్నారు బాలయ్య. బాలకృష్ణ భార్య.. తేజస్వినికి తల్లి అయిన వసుంధరా దేవితో పాటు.. తేజస్విని భర్త శ్రీ భరత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.

బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి కూడా అమెరికాలోనే ఎంబీఏ విద్యాభ్యాసం చేసింది. ప్రస్తుతం నారా లోకేష్ భార్యగా పలు వ్యాపార వ్యవహారాలను చక్కదిద్దుతున్న బ్రాహ్మిణి.. అప్పుట్లో ఎంబీఏ డిగ్రీ పట్టా అందుకున్నపుడు కూడా.. బాలయ్య ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇద్దరు కూతుళ్లు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఎంబీఏను పూర్తి చేయడం.. బాలయ్యకు ఆనందాన్ని డబుల్ చేసే సందర్భం.