Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో వెబ్ ఛానల్ బాస్?

By:  Tupaki Desk   |   22 July 2017 1:01 PM GMT
డ్రగ్స్ కేసులో వెబ్ ఛానల్ బాస్?
X
టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం కేసు దర్యాప్తు స్టార్టయినప్పటి నుంచి కొత్త కొత్త విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడమే కాకుండా ఎకైజ్ శాఖ విచారణ కూడా మొదలెట్టేసింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యాక్టర్ సుబ్బరాజు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడులను ఇప్పటికే ప్రశ్నించారు. విచారణ చేస్తున్న కొద్దీ కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

తాజాగా డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఓ వెబ్ ఛానల్ ఓనర్ ఇన్వాల్వ్ మెంట్ పై పోలీసులకు క్లూ దొరికింది. యూట్యూబ్ లో వెబ్ ఛానెళ్ల కు క్రేజ్ పెరగడంతో తెలుగులోనూ ఈమధ్య కాలంలో పుట్టగొడుగుల్లా వెబ్ ఛానళ్లు పుట్టుకొచ్చాయి. వీటిలో ఇండస్ట్రీకి సంబంధించిన విశేషాలతో రన్ అయ్యేవే ఎక్కువ. ఈ వెబ్ ఛానెళ్లలో రెండు, మూడు బాగా క్లిక్ అయ్యాయి. దీంతో వాళ్లకు ఇండస్ట్రీతో క్లోజ్ రిలేషన్ డెవలప్ అయింది. దీంతో సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవరకు వీళ్ల హవా కొనసాగుతోంది. ఇలాంటి వెబ్ ఛానల్ బాస్ ఒకరు ఇప్పుడు డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్నారనేది లేటెస్ట్ టాక్. శ్యామ్ కె. నాయుడు - సుబ్బరాజులను ప్రశ్నించినప్పుడు అతడి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కేసుకు మూలమైన కెల్విన్ ఫోన్ కాంటాక్టులలోనూ అతడి పేరు కనిపించింది. దీంతో అతడి చుట్టూ ఉచ్చు బిగించేందుకు పోీలీసులు రెడీ అవుతున్నారు.

డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చేందుకు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ జరుపుతున్న కొద్దీ పట్టు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. తాజాగా నిన్నటితరం లవర్ బాయ్ తరుణ్ ను విచారించనున్నారు. ఇదే సమయంలో విచారణ పూర్తయిన వారి నుంచి సేకరించిన శాంపుల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వాటి రిజల్స్ట్ రావడంతోపాటు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేసరికి తెరచాటు నుంటూ మత్తులో జోగుతున్న మరింతమంది పేర్లు బయటకొచ్చే అవకాశముంది.